మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్సీపీకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ( అజిత్ వర్గం ) పార్టీల మధ్య తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి ఒప్పందం కుదురింది. ఈ ఒప్పందం ప్రకారం 48 సీట్లలో బీజేపీకి 28, శివసేనకు 15, ఎన్సీపీకి 4, రాష్ట్రీయ సమాజ్ పక్షానికి 1 సీటు దక్కింది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీలు, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ఆధారంగా మొత్తం 48 స్థానాలకు గాను 45 స్థానాలు గెలవాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ తదుపరి మూడు దశల ఎన్నికలలో మరిన్ని ర్యాలీల్లో ప్రసంగిస్తారని ఎన్డీయే కూటమి నేతలు భావిస్తున్నారు.
Read Also: Interview Tips : ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Also Read
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
కాగా, ముంబై నార్త్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, నాగ్పూర్, చంద్రాపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, అకోలా, అమరావతి, వార్ధా, నాందేడ్, లాతూర్, షోలాపూర్, మాధా, సతారా, రత్నగిరి వంటి 28 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా.. కాగా, సింధుదుర్గ్, నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, పూణే, సాంగ్లీ, అహ్మద్నగర్, బీడ్, ధులే, దిండోరి, భివాండిలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ పాల్ఘర్ క్యాండిడెట్ ను ఇవాళ ప్రకటిస్తామని తెలిపింది.
Read Also: Heat wave Warning: తెలంగాణకు హీట్వేవ్ వార్నింగ్.. 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్
ఇక, శివసేన ( షిండే వర్గం ) ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై సౌత్ సెంట్రల్, థానే, నాసిక్, కళ్యాణ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే, హింగోలి, యవత్మాల్-వాషిమ్, షిర్డీ, రామ్టెక్, బుల్దానా, మావల్ మరియు ఔరంగాబాద్ల నుంచి పోటీ చేస్తోంది. ఎన్సీపీకి బారామతి, రాయ్గఢ్, ధారశివ్, షిరూర్ దక్కగా, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి పర్భానీ సీటును కేటాయించింది.
తాజావార్తలు
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?