Madhyapradesh: భార్యను హత్య చేసి ఆపై తానూ కాల్చుకుని.. సెల్ఫీ వీడియో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Man Kills Wife and Shoots Self: మధ్యప్రదేశ్లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది. తుపాకీ గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను కూడా పోలీసులు కనుగొన్నారు. దాని ఆధారంగా వారు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపారవేత్త సంజయ్ సేథ్ బాగేశ్వర్ ధామ్ భక్తుడు. తన సూసైడ్ నోట్లో “గురూజీ, నన్ను క్షమించు. నాకు మరో జన్మ లభిస్తే, నేను మీ స్థిర భక్తుడిగా ఉంటానని” రాశాడు.
ఈ ఘటనకు ముందు సంజయ్ సేథ్ ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు, అందులో అతను ఏడుస్తూ కనిపించాడు. కొందరు తన నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని పేర్లను చెప్పాడు. “దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి. ఆమె పెళ్లిని రూ.50 లక్షల నుంచి కోటిలో నిర్వహించండి, నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. రూ.29 లక్షలు లాకర్లో ఉంచబడింది. నా భార్య, నేను ఇద్దరం బతకలేక వెళ్ళిపోతున్నాం. కూతురికి చాలా నగలు ఉన్నాయి. నా పిల్లలు, నన్ను క్షమించండి” అంటూ లేఖలో రాశాడు.
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం
సంజయ్ సేథ్ తన భార్య మీనుతో కలిసి నగరం నడిబొడ్డున ఉన్న కిషోర్గంజ్ ప్రాంతంలో నివసించేవాడు. సంఘటన జరిగిన సమయంలో సంజయ్, మీను ఇద్దరూ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉన్నారు. కాల్పుల శబ్ధం విని ఇతర కుటుంబ సభ్యులు పైకి చేరుకున్నారు. అప్పటికే ఆ మహిళ మృతి చెందగా, సంజయ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు.
పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్రాజ్ మీనా మాట్లాడుతూ, ప్రాథమికంగా ఈ విషయం గృహ వివాదానికి సంబంధించినదిగా కనిపిస్తోందన్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం, బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఆ గదిలో దంపతులు ఒంటరిగా ఉన్నారని.. తాము మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!