Madhyapradesh: భార్యను హత్య చేసి ఆపై తానూ కాల్చుకుని.. సెల్ఫీ వీడియో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Man Kills Wife and Shoots Self: మధ్యప్రదేశ్లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది. తుపాకీ గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను కూడా పోలీసులు కనుగొన్నారు. దాని ఆధారంగా వారు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపారవేత్త సంజయ్ సేథ్ బాగేశ్వర్ ధామ్ భక్తుడు. తన సూసైడ్ నోట్లో “గురూజీ, నన్ను క్షమించు. నాకు మరో జన్మ లభిస్తే, నేను మీ స్థిర భక్తుడిగా ఉంటానని” రాశాడు.
ఈ ఘటనకు ముందు సంజయ్ సేథ్ ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు, అందులో అతను ఏడుస్తూ కనిపించాడు. కొందరు తన నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని పేర్లను చెప్పాడు. “దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి. ఆమె పెళ్లిని రూ.50 లక్షల నుంచి కోటిలో నిర్వహించండి, నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. రూ.29 లక్షలు లాకర్లో ఉంచబడింది. నా భార్య, నేను ఇద్దరం బతకలేక వెళ్ళిపోతున్నాం. కూతురికి చాలా నగలు ఉన్నాయి. నా పిల్లలు, నన్ను క్షమించండి” అంటూ లేఖలో రాశాడు.
Also Read
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం
సంజయ్ సేథ్ తన భార్య మీనుతో కలిసి నగరం నడిబొడ్డున ఉన్న కిషోర్గంజ్ ప్రాంతంలో నివసించేవాడు. సంఘటన జరిగిన సమయంలో సంజయ్, మీను ఇద్దరూ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉన్నారు. కాల్పుల శబ్ధం విని ఇతర కుటుంబ సభ్యులు పైకి చేరుకున్నారు. అప్పటికే ఆ మహిళ మృతి చెందగా, సంజయ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు.
పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్రాజ్ మీనా మాట్లాడుతూ, ప్రాథమికంగా ఈ విషయం గృహ వివాదానికి సంబంధించినదిగా కనిపిస్తోందన్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం, బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఆ గదిలో దంపతులు ఒంటరిగా ఉన్నారని.. తాము మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!