Madhyapradesh: భార్యను హత్య చేసి ఆపై తానూ కాల్చుకుని.. సెల్ఫీ వీడియో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Man Kills Wife and Shoots Self: మధ్యప్రదేశ్లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది. తుపాకీ గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను కూడా పోలీసులు కనుగొన్నారు. దాని ఆధారంగా వారు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపారవేత్త సంజయ్ సేథ్ బాగేశ్వర్ ధామ్ భక్తుడు. తన సూసైడ్ నోట్లో “గురూజీ, నన్ను క్షమించు. నాకు మరో జన్మ లభిస్తే, నేను మీ స్థిర భక్తుడిగా ఉంటానని” రాశాడు.
ఈ ఘటనకు ముందు సంజయ్ సేథ్ ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు, అందులో అతను ఏడుస్తూ కనిపించాడు. కొందరు తన నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని పేర్లను చెప్పాడు. “దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి. ఆమె పెళ్లిని రూ.50 లక్షల నుంచి కోటిలో నిర్వహించండి, నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. రూ.29 లక్షలు లాకర్లో ఉంచబడింది. నా భార్య, నేను ఇద్దరం బతకలేక వెళ్ళిపోతున్నాం. కూతురికి చాలా నగలు ఉన్నాయి. నా పిల్లలు, నన్ను క్షమించండి” అంటూ లేఖలో రాశాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం
సంజయ్ సేథ్ తన భార్య మీనుతో కలిసి నగరం నడిబొడ్డున ఉన్న కిషోర్గంజ్ ప్రాంతంలో నివసించేవాడు. సంఘటన జరిగిన సమయంలో సంజయ్, మీను ఇద్దరూ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉన్నారు. కాల్పుల శబ్ధం విని ఇతర కుటుంబ సభ్యులు పైకి చేరుకున్నారు. అప్పటికే ఆ మహిళ మృతి చెందగా, సంజయ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు.
పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్రాజ్ మీనా మాట్లాడుతూ, ప్రాథమికంగా ఈ విషయం గృహ వివాదానికి సంబంధించినదిగా కనిపిస్తోందన్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం, బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఆ గదిలో దంపతులు ఒంటరిగా ఉన్నారని.. తాము మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!