AP Weather : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటలో ఉత్తరాంధ్ర లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర అంతట వర్షాలు ఉంటాయని తెలిపారు. అయితే.. ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరం 11సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. తీరంలో 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్యకారుల వేట వెళ్లవెద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
West Bengal : రైలులో ఎమ్మెల్యే ప్రయాణం.. పక్కన ఉంది భార్య కాదా? షాక్ లో టీటీఈ
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
అయితే.. ఇటీవల కురిసిన వర్షాలకే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత ఐదు రోజులుగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలతో నిరాశ్రులైన వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్ని బాధితులకు సమకూర్చుతున్నారు. ఇప్పుడిప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందనగా.. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఈ రోజు ఉదయం మరోసారి వర్షం కురిసింది. ఇదేకాకుండా.. బుడమేరుకు వరద పెరగడంతో బెజవాడ వాసుల్లో భయం మొదలైంది. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు సీఎం చంద్రబాబు. గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
Koneti Adimulam : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!