West Bengal : రైలులో ఎమ్మెల్యే ప్రయాణం.. పక్కన ఉంది భార్య కాదా? షాక్ లో టీటీఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక టీఎంసీ ఎమ్మెల్యే తన భార్యతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే అక్కడికి రైలులోని టీటీఈ వచ్చారు. టీటీఈ ఎమ్మెల్యే, అతనితో పాటు ప్రయాణిస్తున్న మహిళ టిక్కెట్లు అడిగాడు. ఎమ్మెల్యే టికెట్ కరెక్ట్ అని తేలింది కానీ మహిళ టికెట్ పై టీటీఈకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత టీటీఈ మహిళ గుర్తింపు కార్డును అడిగాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని టీటీఈ షాక్ అయ్యారు.
తన గుర్తింపును నిర్ధారించేందుకు టీటీఈ ఎమ్మెల్యేను ఐడీ అడగడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులు టీటీఈని చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఈ కేసులో ఎమ్మెల్యేకు టీటీఈ జరిమానా విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Read Also:Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. శివసేన, ఎన్సీపీలతో జోడి..!
నబగ్రామ్ కనై చంద్ర మండల్కు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఒక మహిళతో కలిసి డౌన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. విచారణకు వచ్చిన టీటీఈ మహిళను గుర్తించగా.. ఎమ్మెల్యే భార్య టికెట్పై రాసివున్న వయసుకు, ఎదురుగా కూర్చున్న మహిళ వయసుకు మధ్య చాలా తేడా కనిపించింది. ఎదురుగా కూర్చున్న మహిళ ఎమ్మెల్యే భార్య అని నిర్ధారించుకోవడానికి టీటీఈ ఆమెకు గుర్తింపు కార్డును అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే టీటీఈని, ఇతర ఉద్యోగులను చంపేస్తామని ఆయన మద్దతుదారులు బెదిరించినట్లు సమాచారం.
విచారణలో ఎమ్మెల్యేతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ అతని భార్య కాదని, ఆయన పేరుతో ఎమ్మెల్యే వెంట ప్రయాణిస్తున్నది వేరే మహిళ అని తేలింది. దీంతో ఎమ్మెల్యేకు టీటీఈ జరిమానా విధించారు. టిఎంసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్, గవర్నర్కు రైల్వేశాఖ లేఖ రాసింది. రైల్వే ఉద్యోగులను టీఎంసీ ఎమ్మెల్యే నిత్యం చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తూర్పు రైల్వే ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై మాల్దా తూర్పు రైల్వే సీనియర్ డీసీఎంకు బాధిత టీటీఈ అచింత్య సాహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also:Drones : డ్రోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..ఈ రూల్స్ తెల్సుకోకపోతే జైలుకు వెళ్లాల్సిందే
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!