Land Scam: మార్కాపురంలో భూమాయగాళ్లు.. 21 ఎకరాల భూమి దోపిడీ బట్టబయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Scam: మార్కాపురంలో టీడీపీ నేతల భూకబ్జా బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా పేదల నుంచి స్వాధీనం చేసుకున్న భూదందా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మార్కాపురం పరిధిలోని సర్వే నంబర్ 1119లో వున్న చుక్కల భూములను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుటుంబ తమ పేరు పైకి బదిలీ చేయించుకున్న విషయం బయటకు వచ్చింది. 1924 నుంచి వ్యవసాయ భూములుగా ఉన్న 21 ఎకరాల 3 సెంట్ల భూమిని కందుల నారాయణ రెడ్డి కుటుంబం అక్రమంగా సొంతం చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు భూములపై కందుల నారాయణ కుటుంబానికి చెందినవిగా ఆధారాలు చూపాలని అల్టిమేటం జారీ చేశారు. అయితే వాటిని చూపటంలో కందుల నారాయణ రెడ్డి విఫలం కావడంతో అధికారులు లోతుగా విచారణ జరిపారు.
Also Read: Pawan Kalyan: బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు
Also Read
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ప్రకాశం జిల్లా డోర్నాల మండలం హసనాబాద్ గ్రామస్తులైన బాధితులు ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్కు లేఖ రాయడం తో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ తాతల కాలం నాటి భూములను వంశపారంపర్యంగా తాము సాగు చేసుకుంటున్నామని.. అయితే ఈమధ్య కాలంలో కొంతమంది తమకు తెలియకుండా తమ 21 ఎకరాల 3 సెంట్ల భూమిని ఆక్రమించాలనే ఉద్ధేశంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని భూయజమాని అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి చెందిన భూమిపై దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని ఫిర్యాదు చేయడంతో కందుల నారాయణ రెడ్డి కుటుంబం భూదందా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ డాక్యుమెంట్లు, వాటిపై జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ భూకబ్జాపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ మొదలైంది. ఈ భూదందాపై సిట్తో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు బాధితులు లేఖ రాశారు.



తాజావార్తలు
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!