India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England: ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలవడంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓటమిపై స్పందిస్తూ జట్టు చేసిన తప్పులను అంగీకరించాడు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
అయితే, టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆరంభంలో భారత్ జాగ్రత్తగా ఆడినా, విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో జట్టును మంచి స్థితికి తీసుకెళ్లారు. ఒక దశలో భారత్ 300 నుంచి 310 పరుగులు చేసే స్థితిలో కనిపించింది. అయితే మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా భారత్ కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా, అనుభవజ్ఞుడు జో రూట్ మరోసారి తన క్లాస్ను ప్రదర్శించాడు. అద్భుతమైన బ్యాటింగ్తో అజేయంగా 99 పరుగులు చేసిన రూట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. విల్ జాక్స్, సామ్ కరన్తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇంగ్లండ్ను నాలుగు వికెట్ల తేడాతో గెలిపించాడు.
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్, “నిజం చెప్పాలంటే ఈ ఓటమి చాలా నిరాశ కలిగించింది. తొలి 25 ఓవర్ల తర్వాత మేం 300 నుంచి 310 పరుగులు చేయగలమని భావించాం. కానీ, మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కాదన్న విషయం తెలుసు. అయినప్పటికీ లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగైన సహకారం ఆశించాం. మాకు లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చుకోలేకపోయాం” అని పేర్కొన్నాడు.
భారత్ ఇప్పటికే ఈ సిరీస్లో తొలి వన్డేను గెలవగా, రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ విజయంతో సిరీస్ సమమైంది. దీంతో జూలై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టే సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అయితే, భారత్ చివరి వన్డేలో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బాధ్యతగా ఆడితేనే జట్టుకు విజయావకాశాలు మెరుగుపడతాయి. మరోవైపు ఇంగ్లండ్ కూడా అదే జోరును కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగే ఈ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!