RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- రుణ ఎగవేతదారులకు ఆర్బిఐ గట్టి దెబ్బ
- స్వాధీనం చేసుకున్న వారి ఆస్తులను తిరిగి కొనుగోలు చేయలేరు
- అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టే డిఫాల్టర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ వసూలు ప్రక్రియలో భాగంగా బ్యాంకులు స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి అదే రుణగ్రహీతకు లేదా అతనికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా బ్యాంకులు రుణాలివ్వడం తమ ప్రధాన పనిగా చెప్పొచ్చు. అయితే, రుణం నిరర్థక ఆస్తి (NPA)గా మారినప్పుడు, చట్టపరమైన లేదా ఒప్పందపరమైన చర్యల ద్వారా తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఆస్తుల నిర్వహణపై స్పష్టత తీసుకురావడానికే ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ఏడు సంవత్సరాల్లోపు విక్రయం తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆర్థికేతర ఆస్తులను తమ అంతర్గత విధానంలో పేర్కొన్న గడువులో, గరిష్ఠంగా ఏడు సంవత్సరాల్లోపు విక్రయించాలి. అలాగే వీలైనంత త్వరగా బహిరంగ వేలం (Public Auction) ద్వారా వాటిని అమ్మేందుకు ప్రయత్నించాలని ఆర్బీఐ సూచించింది.
డిఫాల్టర్లకు రెండో అవకాశం లేదు
కొత్త నిబంధనల ముసాయిదాపై అభిప్రాయాలు కోరిన సమయంలో, కొందరు రుణగ్రహీతలు తమ స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. అయితే, దీనిని ఆర్బీఐ తిరస్కరించింది. ఇలా అనుమతిస్తే నైతిక ప్రమాదం (Moral Hazard) ఏర్పడుతుందని, రుణ క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొంది. రుణాలు చెల్లించని వారికి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం సరైంది కాదని కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది.
ఆస్తుల విలువ ఎలా నిర్ణయిస్తారు?
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తమ ఖాతాల్లో నమోదు చేసే సమయంలో రెండు విలువల్లో తక్కువ విలువను పరిగణించాలి.
రద్దు చేసిన రుణం పుస్తక విలువ (Book Value)
ఆస్తిని వెంటనే విక్రయిస్తే లభించే అంచనా ధర
ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే, అదే విలువతో ఆస్తిని లెక్కల్లో నమోదు చేయాలి.
బ్యాంకు వినియోగిస్తే ఎలా?
స్వాధీనం చేసుకున్న ఆస్తిని బ్యాంకు స్వయంగా కార్యాలయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తే, ఆ ఆస్తిని ఆర్థికేతర ఆస్తుల జాబితా నుంచి తొలగించి ‘స్థిరాస్తులు (Fixed Assets)’ లేదా సంబంధిత అకౌంటింగ్ శీర్షిక కింద నమోదు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కీలక అంశాలు
2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
డిఫాల్టర్లు లేదా వారి అనుబంధ వ్యక్తులు స్వాధీనం చేసిన ఆస్తులను తిరిగి కొనుగోలు చేయలేరు.
స్వాధీనం చేసిన ఆస్తులను గరిష్ఠంగా 7 ఏళ్లలోపు విక్రయించాలి.
బహిరంగ వేలానికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
రుణ క్రమశిక్షణను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
- Tags
- Loan Defaulters
- properties
- RBI
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!