Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ కావొచ్చని పలు ప్రముఖ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి లేదా రోహిత్ శర్మ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కథనాల ప్రకారం.. తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య జరిగిన సమావేశంలో 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ప్రణాళికపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ భవిష్యత్పై సెలెక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే వన్డేలకు ఎప్పుడు వీడ్కోలు చెప్పాలనేది పూర్తిగా రోహిత్ వ్యక్తిగత నిర్ణయమేనని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ఇప్పటికే రోహిత్ శర్మ 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్కు, 2025లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన వన్డే ఫార్మాట్లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా 11, 26 పరుగులకే పరిమితమవడంతో అతని ఫామ్పై చర్చ జరుగుతోంది. దీనితో ఇప్పుడు రిటైర్మెంట్పై వచ్చిన వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
అయితే భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాత్రం ఈ వార్తలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిపై ఇలాంటి ఒత్తిడి ఉండదని, రెండు మ్యాచ్ల్లో పరుగులు చేయకపోవడం వల్ల అతని సామర్థ్యాన్ని ప్రశ్నించలేమని వ్యాఖ్యానించారు. “రోహిత్ శర్మ చాలా గొప్ప ఆటగాడు. అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉందని నేను భావించడం లేదు. కొన్ని మ్యాచ్ల్లో పరుగులు రాకపోవడం సహజం. లార్డ్స్లో అతని నుంచి పూర్తిగా భిన్నమైన ఇన్నింగ్స్ను చూడొచ్చు” అని కోటక్ మీడియాతో అన్నారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వస్తున్న సమాచారం అంతా కథనాల ఆధారంగానే ఉంది. బీసీసీఐ లేదా రోహిత్ శర్మ అధికారికంగా ప్రకటించే వరకు ఈ వార్తలను ధృవీకరించలేము. దీంతో లార్డ్స్ వన్డే తర్వాత ఎలాంటి ప్రకటన వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!