KTR : బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ ఘాటు సమాధానం
- కేంద్రమంత్రి బండి సంజయ్క కేటీఆర్ కౌంటర్
- కేంద్రమంత్రిగా ఉంది పనికిమాలిన మాటలు మాట్లాడకు
- బీదర్లో దొంగనోట్లు ముద్రించారన్న బండి సంజయ్ కర్ణాటకలోలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందన్న సంగతి మర్చిపోతే ఎలా.?
- అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా.. విచారణ చేయండి.? :కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తాము దొంగనోట్లను ముద్రించారని ఆరోపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, “మీరు కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగలు అంటారు. అయితే, అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా? దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాల్సింది మీరే!” అని వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని ఆరోపించారు.
దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేపట్టకూడదన్నదే తమ పార్టీ యొక్క స్పష్టమైన డిమాండని కేటీఆర్ తెలిపారు. “దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అందుకే, ఈ సమస్యను చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు హాజరయ్యాం,” అని వివరించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
బీజేపీ అసలు ముసుగును తొలగించేందుకు, దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తేవాలని తమ పార్టీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. “పార్లమెంట్ కొత్త భవనంలో అన్ని సీట్లను లెక్క ప్రకారం ఏర్పాటు చేశారు. కానీ, అసలు సమస్య ఏమిటంటే, బీజేపీ ఉత్తరాదిలో, ముఖ్యంగా అస్సాం, జమ్ముకాశ్మీర్లో సీట్లు పెంచుతూనే ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకు పెంచడం లేదు?” అని ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం పోరాడటం రాజకీయాలకతీతంగా చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు. “ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే విషయమే కాదు. ముందుగా మనం భారతీయులం. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు.
Municipal Chairman: అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత
తాజావార్తలు
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!