Kollu Ravindra : మచిలీపట్నంలో అర్థరాత్రి నాటకీయ పరిణామాలు
మచిలీపట్నంలో అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దొంగ పట్టాలు సిద్దం చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుకున్నారు. అయితే.. అవి దొంగ పట్టాలు కాదని పెండింగ్ లో ఉన్న పట్టాలకు సంబంధించి వర్క్ చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది వెల్లడించారు. దీంతో.. కొల్లు రవీంద్ర సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో సతీష్. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో దొంగ పట్టాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దొంగ పట్టాలపై డీటీ సంతకాలు పెడుతుండటాన్ని అడ్డుకున్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. సుమారు వెయ్యి దొంగ పట్టాలను ఆర్ఐ యాకూబ్ తీసుకెళ్లి వైసీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన దొంగ పట్టాల దందాపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కి కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. దొంగ పట్టాలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినా స్థానిక రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే పేర్ని నానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Tragedy : బేగంపేట్లో విషాదం.. పూజ చేస్తుండగా అగ్నికి ఆహుతైన రిటైర్డ్ ప్రిన్సిపాల్
-
NDA Protests : నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఎన్డీఏ
-
Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
-
Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
-
Virat Kohli: విరాట్ కోహ్లీని చూస్తే చాలా బాధగా ఉంది.. జర్మన్ బ్యూటీ రియాక్షన్..
ట్రెండింగ్
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?