భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.
Also Read:OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
ఈ విషయం ఇప్పటికే బీసీసీఐ దృష్టికి వెళ్లడంతో.. పునరాలోచించాలని బీసీసీఐ కోహ్లీకి విజ్ఞప్తి చేసిందట. అయితే కోహ్లీ మౌనం వహించడంతో తన రిటైర్మెంట్ త్వరలోనే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ టెస్టులకు రిటైర్ అయితే భారత క్రికెట్లో ఇదొక సెన్సేషన్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు మ్యాచులు చూస్తున్నారంటే అది కేవలం రోహిత్, కోహ్లీ కోసమే. వీళ్ళిద్దరూ లేని క్రికెట్ ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే వన్డేల్లో కొనసాగడం కాస్త ఊరట కలిగిస్తుంది. సచిన్ తర్వాత ధోనీ, ధోనీ తర్వాత రోహిత్ కోహ్లీలు ఇండియన్ క్రికెట్ ను ముందుకు నడిపించారు.
Also Read:IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
అయితే వీళ్ళిద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో యువభారత్ టీమిండియాను ముందుకు నడిపించాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్ ఎంపిక బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. విరాట్ కోహ్లి స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలో సెలెక్టర్లకు అర్ధం కావడం లేదు. కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.ఏదేమైనా కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటే భారత క్రికెట్లో ఒక శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.