IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
- పాకిస్తాన్కు వంతపాడుతున్న టర్కీ, అజర్బైజాన్..
- ఆరు విమానాల్లో పాక్ కు డ్రోన్లు పంపిన టర్కీ..
- పహల్గామ్ మృతులకు సంతాపం ప్రకటించిన టర్కీ..
- అటు పాక్.. ఇటు ఇండియాకు దగ్గర కావడానికి టర్కీ డబుల్ గేమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiaPakWar: టర్కీ దేశం డబుల్ గేమ్ ఆడుతుంది. చేసిన సాయానికి కృతజ్ఞత చూపించకుండా భారత్ పై విషం కక్కుతుంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం ఇండియానే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందజేసింది. బాధితులకు ఆహారం, మెడిసిన్ సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోడీ సర్కార్ పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపిస్తే.. ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్థాన్కు డ్రోన్లను పంపిస్తుంది టర్కీ.
Read Also: India Pak War : భారత సైనిక చర్యతో ఎమర్జెన్సీ భేటీకి షాబాజ్ షరీఫ్ పిలుపు..!
Also Read
అయితే, గురువారం నాడు పాకిస్తాన్ భారీస్థాయిలో భారత్పై డ్రోన్లతో దాడులు చేసింది. దాదాపు 300- 400 డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. కాగా, ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా.. అవన్నీ టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్’ డ్రోన్లుగా తేలింది. ఇక, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు మొదటి నుంచి భారత్ పై విపరీతమైన ద్వేషం ఉంది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో అతడు బహిరంగంగా తెలియజేశాడు. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తుంటే.. టర్కీ అధినేత మాత్రం పాక్ ప్రధానితో కలిశారు. ఆ దేశానికి మద్దతు పలికారు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
ఇక, పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని ముందుగానే ఊహించిన టర్కీ.. ఆరు సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను పంపించింది ఎర్డోగాన్ సర్కార్. టర్కీ సీ-130ఈ హెర్క్యూలస్ విమానం గత నెల 28వ తేదీన ఇస్లామాబాద్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు తెలిపాయి. అయితే, ఇంధనం నింపుకోవడానికి తమ యుద్ధ విమానం దిగిందని అబద్దపు మాటలు చెప్పింది టర్కీ. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్పై దాయాది దేశం ప్రయోగిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత టర్కీ, అజర్ బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తూ వెల్లడించాయి. అయితే, తాజాగా, పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు టర్కీ సంతాపం ప్రకటించింది. దీంతో టర్కీ అధినేత డబుల్ గేమ్ పై భారత్ ఇంకా స్పందించలేదు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!