Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆ స్టార్ బ్యాటర్ దూరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్-2023 టోర్నీకి టైం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్తో ఆసియా కప్ కు టోర్నో స్టార్ట్ కానుంది. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ వన్డే టోర్నమెంట్ లో టీమిండియా తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న దాయాది జట్టుతో టీమిండియా ఈవెంట్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పల్లకెలె వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ కీలక పోరుకు భారత జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. పాకిస్తాన్తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.
Read Also: Vizag POCSO Court: కన్నకూతురుపై అత్యాచారం, గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
అయితే, శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఆసియా కప్ కు టీమ్ ను ప్రకటించిన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు క్లారిటి ఇచ్చాడు. అయితే, భారత జట్టుకు ఇదొక గొప్ప న్యూస్.. ఇక కేఎల్ రాహుల్ను మాత్రం గాయం వెంటాడుతోంది.. ఆసియా కప్లో టీమిండియా రెండు లేదంటే మూడో గేమ్ నాటికి అతడు పూర్తిగా అందుబాటులోకి రావొచ్చు అని అతడు వెల్లడించాడు.
Read Also: Congress: ఖర్గే ప్రకటించిన CWCలో 50 ఏళ్లలోపు నేతలు ముగ్గురే
కాగా, ఐపీఎల్-2023లో కేఎల్ రాహుల్ గాయపడి.. జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాకిస్ట్ చేస్తున్నాడు.. అయితే, ఇంకా వంద శాతం ఫిట్నెస్ పొందలేదని తాజాగా అజిత్ అగార్కర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ను ట్రావెలింగ్ స్టాండ్బైగా బీసీసీఐ యాజమాన్యం ఎంపిక చేసింది. పాకిస్తాన్ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్తో మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..