Congress: ఖర్గే ప్రకటించిన CWCలో 50 ఏళ్లలోపు నేతలు ముగ్గురే
ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులతో సహా మొత్తం 84 మంది ఉన్నారు. అయితే ఖర్గే సీడబ్ల్యూసీ టీమ్లో ఎక్కువగా సీనియర్ నేతలు ఉన్నారు. అయితే యువ నేతలకు అవకాశం ఇవ్వలేదని చెప్పొచ్చు.
BRS : బీఆర్ఎస్ అభ్యర్థులు మారిన స్థానాలు ఇవే
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
CWCలో అత్యంత సీనియర్ గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉండగా.. తక్కువ వయస్సుతో NSUIకి చెందిన నీరజ్ కుందన్ ఉన్నారు. ఉదయ్పూర్లోని చింతన్ క్యాంపులో మరియు రాయ్పూర్ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని స్థాయిలలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు యువతకు ఇస్తామని పేర్కొంది. ’50 అండర్ 50′ ఫార్ములా బ్లాక్ కమిటీ నుండి CWC వరకు జరగాలని కాంగ్రెస్ చెప్పింది. అయితే నిన్న ప్రకటించిన సీడబ్ల్యూసీలో ముగ్గురు మాత్రమే తక్కువ వయస్సు ఉన్న నేతలు ఉన్నారు. మొత్తం 84 మంది సభ్యుల జాబితాలో కేవలం ఒకటిన్నర డజను మంది నాయకులు మాత్రమే 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
Sudigali Sudheer: ఒక విరాట్.. ఒక రాజమౌళి.. ఒక సుడిగాలి సుధీర్.. అదిరిన ‘గోట్’ గ్లింప్స్
సీడబ్ల్యూలోని 39 మంది సభ్యులలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నాయకులలో సచిన్ పైలట్ (46), గౌరవ్ గొగోయ్ (43), కమలేశ్వర్ పటేల్ (49) ఉన్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుల్లో కన్హయ్య కుమార్కు 36 ఏళ్లు, దీపేందర్ సింగ్ హుడాకు 45 ఏళ్లు, మాణికం ఠాగూర్కు 48 ఏళ్లు, దేవేంద్ర యాదవ్కు 50 ఏళ్లు, మీనాక్షి నటరాజన్కు 50 ఏళ్లు గలవారు ఉన్నారు. CWC ప్రత్యేక ఆహ్వానితులలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నాయకులకు స్థానం లభించింది. వారిలో NSUI అధ్యక్షుడు నీరజ్ కుందన్ 33 సంవత్సరాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్వినివాస్ బీవీ 41 సంవత్సరాలు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్తె కుమార్ షిండే పరిణీతి షిండే వయస్సు 42 సంవత్సరాలు, సుప్రియా శ్రీనాతే వయస్సు 46 సంవత్సరాలు, అల్కా లాంబా వయస్సు 47 సంవత్సరాలు, నేతా డిసౌజా వయస్సు 48 సంవత్సరాలు, యశోమతి ఠాకూర్ వయస్సు 49 సంవత్సరాలు ఉన్నారు. ఇదిలా ఉంటే మిగిలిన 68 మంది సభ్యులు 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
Health Tips : వీటిని రోజూ రాత్రి తింటే చాలు.. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళతారు..
సీడబ్ల్యూసీలో 50 ఏళ్లు పైబడిన నాయకులు దాదాపు 68 మంది ఉన్నారు. 70 ఏళ్లు పైబడిన నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సీడబ్ల్యూసీలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు 90 ఏళ్లు.. అతను అత్యంత వృద్ధ నేత. అతని తరువాత మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీకి 82 సంవత్సరాలు, మల్లికార్జున్ ఖర్గేకి 81 సంవత్సరాలు ఉన్నాయి.
వీరితో పాటు లాల్ థానేవాల్ 81 సంవత్సరాలు, అంబికా సోనీ 80 సంవత్సరాలు, మీరా కుమార్ 78 సంవత్సరాలు, పి చిదంబరం 77 సంవత్సరాలు, సోనియా గాంధీ 76 సంవత్సరాలు, దిగ్విజయ్ సింగ్ 76 సంవత్సరాలు, హరీష్ రావత్ 75 సంవత్సరాలు, తౌమ్రధ్వాజ్ సాహు 74 సంవత్సరాలు, తారిఖ్ అన్వర్ 72 సంవత్సరాలు మరియు ఆనంద్ శర్మ వయసు 70 ఏళ్లు ఉన్నారు. అంతేకాకుండా CWC యొక్క శాశ్వత ఆహ్వానితులలో మరియు ప్రత్యేక ఆహ్వానితులలో చాలా మంది నాయకుల్లో 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!