IND vs NZ: 785 రోజుల తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి T20I లకు.. కన్ఫార్మ్ చేసిన కెప్టెన్ సూర్య
- 785 రోజుల తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి T20I లకు
- తొలి టీ20లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్
- ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో జరిగిన T20I ఆడాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్పూర్లో జరిగే ఈ మ్యాచ్లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో జరిగిన T20I ఆడాడు. చాలా కాలం తర్వాత, 27 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్మన్ దేశవాళీ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శనలతో జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించాడు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
తొలి టీ20 మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, తిలక్ వర్మ మొదటి మూడు మ్యాచ్ లకు అందుబాటులో లేనందున ఇషాన్ కు అవకాశం ఇవ్వడం ఖచ్చితంగా సరైన నిర్ణయమని అన్నారు. సూర్య మాట్లాడుతూ.. కిషన్ మా ప్రపంచ కప్ ప్లాన్ లో భాగం. అందుకే ఈ టీ20కి ఎంపికయ్యాడన్నారు. తిలక్ అందుబాటులో లేడు, 3వ స్థానానికి ఇషాన్ ఉత్తమ ఎంపిక అని నేను భావిస్తున్నాను అని సూర్య అన్నారు. ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో తన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. జార్ఖండ్ తొలి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) టైటిల్లో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్లో ఇషాన్ 10 ఇన్నింగ్స్లలో 517 పరుగులు చేశాడు, సగటున 57.44, 197 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ను కొనసాగించాడు. హర్యానాతో జరిగిన ఫైనల్లో కేవలం 49 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
జార్ఖండ్ కెప్టెన్గా, ఇషాన్ జట్టును 262/3 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జార్ఖండ్ ఈ మ్యాచ్ను 69 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ ప్రదర్శన తర్వాత, సెలెక్టర్లు 2026 T20 ప్రపంచ కప్ కోసం శుభ్మాన్ గిల్ కంటే ముందుగా కిషన్ ను జట్టులో చేర్చారు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి ఇషాన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!