Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kishan Reddy Responded On Heavy Floods In Telangana

Kishan Reddy: విపత్తుగా ప్రకటించడం కాదు.. నిధులు ఇస్తున్నామా లేదా?

Published Date :September 3, 2024 , 5:08 pm
By Mahesh Jakki
  • కేంద్ర బృందాలు అంచనా వేసి నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇస్తుంది
  • అవసరమైతే ప్రధాని పర్యటిస్తారు
  • జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదు
  • నిధులు ఇస్తున్నామా లేదా అది ముఖ్యం
  • కీలక విషయాలు వెల్లడించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: విపత్తుగా ప్రకటించడం కాదు.. నిధులు ఇస్తున్నామా లేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం వాయిదా వేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై మోడీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వెల్లడించారు. కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించిందన్నారు. కేంద్ర హోంసెక్రటరీ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని చెప్పారు. అవసరం అయిన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. దెబ్బతిన్న జాతీయ రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఖమ్మం ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు.

నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇస్తుంది.. !
పార్టీ స్థానిక కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో రాజకీయ విమర్శలు చేయకుండా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పార్టీకి ఆదేశించామన్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్‌లో కేంద్ర నిధులు ఉంటాయన్నారు. నిధులకు కొరత లేదని, వాటితో సహాయ కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గతంలో ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదన్నారు. జూన్ 1న 208 కోట్లు రిలీజ్ అయ్యాయని.. అవి కేంద్రం దగ్గర ఉన్నాయన్నారు. 1328 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్ ఫండ్ రాష్ట్రం దగ్గర ఉన్నాయన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ) సబ్మిట్ చేస్తే రూ. 208 కోట్లు కూడా వస్తాయన్నారు. కేంద్ర బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించారు.

Read Also: Manjira River: ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం

విపత్తుగా ప్రకటించడం కాదు నిధులు ఇస్తున్నామా లేదా?
మృతి చెందిన వారికి కేంద్రం రూ.3 లక్షలు ఇస్తుందని చెప్పారు. సీఎం వీటిని కలుపుకుని రూ.5లక్షలు అన్నారా లేక రాష్ట్ర సర్కారు తరఫున అన్నారో తెలియదన్నారు. ఇతర నష్టాలు జరిగిన వాటికి కూడా కేంద్రం సహాయం అందిస్తుందన్నారు. గొర్రెలు చనిపోతే ఒక్కో గొర్రెకు నాలుగు వేలు.. గేదెకు 32 వేలు ఇస్తుందన్నారు. పొలంలో మట్టి పేరుకు పోతే ఒక హెక్టార్‌కు 18 వేలు కేంద్రం ఇస్తుందన్నారు. ఉద్యాన పంటలు నష్టపోతే కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపోర్ట్ పంపించి కేంద్రం నుండి నిధులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సహాయము చేయాలి… వైద్యము అందించాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి… పూర్తిగా కోల్పోయిన వారికి వెంటనే అన్ని అందించాలని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ప్రధాని పర్యటిస్తారని చెప్పారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదన్నారు. విపత్తుగా ప్రకటించడం కాదు నిధులు ఇస్తున్నామా లేదా అనేది ముఖ్యమన్నారు. వెంటనే విపత్తు జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలకు విఘాతం కలిగించవద్దనేది కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. కేరళలో అంత విపత్తు సంభవించిన వెంటనే ప్రధాని వెళ్లలేదన్నారు. ఇప్పటి వరకు స్థానిక అధికారులు బాధితుల దగ్గరకి వెళ్ళలేదని.. వారికి సహాయం అందించలేదు అని బాధితులు అంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నష్టాన్ని కూడా అంచనా వేయలేదని ఆయన అన్నారు.

విమోచన వేడుకలు.. ఇక ప్రతి సంవత్సరం
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నారని పేర్కొన్నారు. మజ్లీస్‌కు భయపడి గత ప్రభుత్వాలు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయాయని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీపైన జాతీయ జెండా ఎగరవేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP membership programme
  • heavy floods
  • Kishan Reddy
  • PM Modi

తాజావార్తలు

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions