ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయ యువకుడిని అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శనివారం తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే కరణ్ బ్రార్ (22), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ప్రీత్ సింగ్ (28) ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.