Arvind Kejriwal: బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్కు ఆయుధం దొరికింది?.. అదేంటంటే?
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ
- మహిళల భద్రత, నేరాలపై ఆప్ ప్రశ్నలు
- వీటిని ఆయుధంగా మలచుకునేందుకు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
READ MORE: Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ‘మహిళా అదాలత్’కు పిలుపునిచ్చారు. ఇందులో కేజ్రీవాల్ మహిళలను ఉద్దేశించి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మహిళలు ఎంతకాలం భయంభయంగా బతుకుతారని కేజ్రీవాల్ అన్నారు. నిర్భయ ఘటన జరిగి నేటికి 12 ఏళ్లవుతుందని..ఈ ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం వీధుల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఈ ఘటన తర్వాత మహిళలపై నేరాలు అంతం అవుతాయని భావించినా.. అది జరగలేదని.. నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఈరోజు ఢిల్లీలో కూతుళ్లు కాలేజీకి వెళితే సాయంత్రం 7 గంటలకే తల్లిదండ్రుల గుండెలు దడదడలాడుతున్నాయన్నారు. ఢిల్లీలో నేరస్తులను ఎందుకు పట్టుకోవడం లేదో ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
“10 సంవత్సరాల క్రితం ఓటర్లు పాఠశాల, ఆసుపత్రిని బాగు చేసే బాధ్యతను నాకు ఇచ్చారు. రెండింటినీ ఎలా పరిష్కరించాలో చూపించాను. కరెంటును చౌకగా ఇవ్వాలని కోరారు. నేను ఉచితంగా అందజేశాను. కానీ ఢిల్లీలో ప్రజల భద్రత బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అమిత్ షా ప్రజలకు భద్రతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో రోజుకు 3-4 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అమిత్ షా శాంతిభద్రతలు మీకు సమస్య కాకపోవచ్చు. సాధారణ జనాలను ఇదో పెద్ద సమస్యగా మారింది.” అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!