Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదు..
- అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Komatireddy Venkat Reddy: ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదని.. అందుకే అసెంబ్లీ వస్తలేరు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. కొడుకు , అల్లుడు , బిడ్డలను తాము పట్టించుకోమన్నారు. డీలిమిటేషన్లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందన్నారు. మా సీఎం , మంత్రులు పబ్లిక్కి అందుబాటులో ఉంటున్నాము ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి పార్లమెంట్కి వెళ్లారన్నారు.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
Also Read
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
బడ్జెట్ సమావేశాల వరకు కొత్త మంత్రివర్గం రెడీ అవుతుందని ఆయన వెల్లడించారు.కాంగ్రెస్లో మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరన్నారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం, సీఎందే తుది నిర్ణయమన్నారు. పాలమూరు నుంచి శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి.. ఇది మాత్రం చెప్పగలనన్నారు. నల్గొండలో 2018లో భూపాల్ రెడ్డిని వికలాంగుడు అనే సానుభూతితో గెలిపించారంటూ మంత్రి విమర్శించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారు.. నేనెంత అంటూ వ్యాఖ్యానించారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారన్నారు. తన మీద గెలిచేందుకు బూర నర్సయ్య రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని.. అయినా తానే గెలిచానన్నారు. ప్రతిపక్ష ఎంపీగా ఎన్నో రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. గడ్కరీ నిన్న సీఎంకు చెబుతూ.. వెంకన్న నాకు చోటా బాయ్ అన్నారన్నారు.
తాజావార్తలు
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!