Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదు..
- అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komatireddy Venkat Reddy: ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదని.. అందుకే అసెంబ్లీ వస్తలేరు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. కొడుకు , అల్లుడు , బిడ్డలను తాము పట్టించుకోమన్నారు. డీలిమిటేషన్లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందన్నారు. మా సీఎం , మంత్రులు పబ్లిక్కి అందుబాటులో ఉంటున్నాము ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి పార్లమెంట్కి వెళ్లారన్నారు.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
బడ్జెట్ సమావేశాల వరకు కొత్త మంత్రివర్గం రెడీ అవుతుందని ఆయన వెల్లడించారు.కాంగ్రెస్లో మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరన్నారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం, సీఎందే తుది నిర్ణయమన్నారు. పాలమూరు నుంచి శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి.. ఇది మాత్రం చెప్పగలనన్నారు. నల్గొండలో 2018లో భూపాల్ రెడ్డిని వికలాంగుడు అనే సానుభూతితో గెలిపించారంటూ మంత్రి విమర్శించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారు.. నేనెంత అంటూ వ్యాఖ్యానించారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారన్నారు. తన మీద గెలిచేందుకు బూర నర్సయ్య రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని.. అయినా తానే గెలిచానన్నారు. ప్రతిపక్ష ఎంపీగా ఎన్నో రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. గడ్కరీ నిన్న సీఎంకు చెబుతూ.. వెంకన్న నాకు చోటా బాయ్ అన్నారన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!