EV Sales in India: ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 36 లక్షల ఈవీలు సేల్.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అమ్ముడయ్యాయంటే..?
- ఇండియాలో ఈవీ (EV)ల అమ్మకం
- ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్న జనాలు
- ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా 36 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అందులో.. టాప్-5లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి..? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. దీంతో పాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందించింది. సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 3639617 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈవీలు అమ్మకాల పరంగా అత్యధిక నమోదు అయిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య ఉత్తరప్రదేశ్లో 665247 యూనిట్ల ఈవీలు అమ్మకం జరిగాయి. ఆ తర్వాత 439358 యూనిట్ల ఈవీలు అమ్మకాలు జరిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో కర్ణాటకలో 350810 యూనిట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 228850 యూనిట్లు నమోదయ్యాయి. 233503 యూనిట్ల నమోదుతో రాజస్థాన్ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అలాగే.. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో మొత్తం 216084 యూనిట్లు నమోదయ్యాయి.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ MORTH పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019-2024 మధ్య సిక్కింలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనం కూడా అమ్ముడు కాలేదు. అలాగే.. లక్షద్వీప్లో 19, నాగాలాండ్లో 27, అరుణాచల్ ప్రదేశ్లో 42, లడఖ్లో 88, అండమాన్ మరియు నికోబార్లో 191, దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో 468, మిజోరాంలో 344, మేఘాలయలో 572, మణిపూర్లో 12304, హిమాచల్ ప్రదేశ్ , పుదుచ్చేరిలో 5933 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!