EV Sales in India: ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 36 లక్షల ఈవీలు సేల్.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అమ్ముడయ్యాయంటే..?
- ఇండియాలో ఈవీ (EV)ల అమ్మకం
- ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్న జనాలు
- ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా 36 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అందులో.. టాప్-5లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి..? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
Also Read
- Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
- TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. దీంతో పాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందించింది. సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 3639617 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈవీలు అమ్మకాల పరంగా అత్యధిక నమోదు అయిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య ఉత్తరప్రదేశ్లో 665247 యూనిట్ల ఈవీలు అమ్మకం జరిగాయి. ఆ తర్వాత 439358 యూనిట్ల ఈవీలు అమ్మకాలు జరిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో కర్ణాటకలో 350810 యూనిట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 228850 యూనిట్లు నమోదయ్యాయి. 233503 యూనిట్ల నమోదుతో రాజస్థాన్ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అలాగే.. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో మొత్తం 216084 యూనిట్లు నమోదయ్యాయి.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ MORTH పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019-2024 మధ్య సిక్కింలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనం కూడా అమ్ముడు కాలేదు. అలాగే.. లక్షద్వీప్లో 19, నాగాలాండ్లో 27, అరుణాచల్ ప్రదేశ్లో 42, లడఖ్లో 88, అండమాన్ మరియు నికోబార్లో 191, దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో 468, మిజోరాంలో 344, మేఘాలయలో 572, మణిపూర్లో 12304, హిమాచల్ ప్రదేశ్ , పుదుచ్చేరిలో 5933 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!