Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kcr Was Furious With The Congress Government 2

KCR: ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు, అబద్ధాలు..

Published Date :April 5, 2024 , 6:59 pm
By Rajesh Veeramalla
KCR: ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు, అబద్ధాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరువుతో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. నీటి నిర్వహణ సామర్ధ్యం, నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఎండిపోయాయని కేసీఆర్ తెలిపారు.

Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..

Also Read

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
  • Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
  • West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..

మరోవైపు.. సిగ్గులేకుండా ఈరోజు మరో 5 గ్యారంటీ హామీలు ఇచ్చారు.. కొందరు చేతకాని మంత్రులు కాలం కాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వడంలో వైఫల్యం చెందారు.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షల సాయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. పంటలు ఎండిన వారికి ఎకరాకు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. సాగర్ లో నీళ్లున్నా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము కరీంనగర్ వస్తున్న అనగానే… కూలిపోయింది అన్న కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు వదలాలి అని కేసీఆర్ చెప్పాలి అంటున్నాడు ముఖ్యమంత్రి.. నీళ్లు వదలడం తెలియని నువ్వా సీఎం.. నేనా సీఎం అని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నాడు సీఎం… ఏమైంది అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కరీంనగర్ కి ఏ కాలంలో అయినా ఢోకా ఉండదు అని చెప్పినం… చేసి చూపించామన్నారు కేసీఆర్. మానేరు వాగు నిత్యం నీటితో కళకళ లాడేలా చేశాం.. వరద కాలువను ఒకటిన్నర టీఎంసీలతో సజీవ జలాధారగా మర్చాము.. సాగునీటి ఫలితాలు అనుభవించిన కరీంనగర్ ప్రజలు నాలుగు నెలల్లోనే ఏం జరిగిందో చూసారని తెలిపారు. మధ్య మానేరు బ్యారేజీ ఎండిపోయింది.. మునిగిన ఊర్లు తేలి స్మశానం లాగా మారిందని పేర్కొన్నారు. లోయర్ మానేరు ఎండిపోయి కరీంనగర్ లో నీటి కరువు వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.

Yatra 2 OTT: ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2

మీ వెర్రి వేషాలు, పాగల్ మాటల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తాం అన్నారు… జొన్న పంట సగమే కొంటాం అంటున్నారు.. మీరు పంటలకు బోనస్ ఇవ్వకపోతే మీకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని కేసీఆర్ ఆరోపించారు. గొర్రెల యూనిట్ల కోసం వందల కోట్లు డీడీలు కట్టిన యాదవులను మోసం చేశారన్నారు. దళిత సోదరులు దళిత బంధు కోసం కాంగ్రెస్ ని నిలదీయండని తెలిపారు. కల్యాణ లక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామన్నారు.. మీకు బంగారం దొరుకుత లేదా? అని ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్లు మీ ఇందిరమ్మ రాజ్యంలో 200 ఉంటే 2వేలు చేశాం.. నాలుగు వేలు పెంచుతాం అన్నారు.. 30 లక్షల మందిని మోసం చేశారని దుయ్యబట్టారు. మీరన్న రెఫరెండంకి వృద్ధాప్య పెన్షనర్లు కర్రు కాల్చి వాతపెడతారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • CM Revanth Reddy
  • congress
  • Crops
  • karimnagar

తాజావార్తలు

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

  • Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

  • Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..

  • Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions