Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ecs Step Forward Is Aimed At Increasing Voting Percentage

Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..

Published Date :April 5, 2024 , 6:28 pm
By Rajesh Veeramalla
Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాల సీఈఓలను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ శాతాలు నమోదు కావడానికి ఏదైనా నిర్దిష్ట సమస్య ఎదురైతే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చివరి నిమిషంలో పరిష్కారాలకు బదులుగా ఓటర్లలోని గందరగోళాన్ని తొలగించేందుకు వ్యవస్థాగత మరియు దీర్ఘకాలిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

Hyderabad: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం..

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సీఈఓలు తమ తమ రాష్ట్రాలలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి వారు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా.. బస్టాండ్‌లు, రవాణా వాహనాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో కమిషన్ యొక్క కీలక సందేశాలను ప్రదర్శించడం, వాలంటీర్లు మరియు ప్రభుత్వేతర సంస్థల సేవలను వినియోగించుకోవడం, ఓటర్లు ఓటు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు వారు తెలిపారు. ఇంకా.. పార్కులు, మార్కెట్లు, మాల్స్ మరియు బహిరంగ ప్రదేశాలలో నిర్వహించే ప్రదర్శనల వద్ద అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీరు, పోలింగ్‌ కేంద్రాల్లో వికలాంగులతో సహా వీల్‌ చైర్‌లో వెళ్లే ఓటర్లకు ర్యాంపులు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్ల భయంతో కొందరు ఓటర్లు బయటకు రావడం లేదని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. బూత్‌ల వద్ద క్యూలను వేగంగా కదిలేలా కొత్త పద్ధతులు, చర్యలు తీసుకుంటామన్నారు.

Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..

ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ హైదరాబాద్ నగరం గురించి ప్రజెంటేషన్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 45.65 తక్కువ పోలింగ్ శాతం నమోదైందన్నారు. యువకుల ఉదాసీనత, రోజువారీ వేతనాలు పొందే వారు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు బూత్‌లకు కేటాయించడం, అంతర్గత వలసలు మరియు క్యూలో వేచి ఉండటమే తక్కువ ఓటింగ్‌కు కారణమని చెప్పారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కమీషన్ సందేశాలను హైలైట్ చేసే పాటలను వినిపించేందుకు దాదాపు 4,500 స్వచ్చ ఆటోలు ఉపయోగిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్లను బూత్‌కు ఆహ్వానించేందుకు యువతను నియమించనున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే లక్నో, నాగ్‌పూర్ మరియు థానే వంటి ప్రధాన నగరాలకు సంబంధించిన సీఈవోలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు హాజరయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CEOs
  • EC
  • loksabha elections
  • telugu news
  • video conference

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions