Election Commission: ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాల సీఈఓలను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ శాతాలు నమోదు కావడానికి ఏదైనా నిర్దిష్ట సమస్య ఎదురైతే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చివరి నిమిషంలో పరిష్కారాలకు బదులుగా ఓటర్లలోని గందరగోళాన్ని తొలగించేందుకు వ్యవస్థాగత మరియు దీర్ఘకాలిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
Hyderabad: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం..
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సీఈఓలు తమ తమ రాష్ట్రాలలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి వారు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా.. బస్టాండ్లు, రవాణా వాహనాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో కమిషన్ యొక్క కీలక సందేశాలను ప్రదర్శించడం, వాలంటీర్లు మరియు ప్రభుత్వేతర సంస్థల సేవలను వినియోగించుకోవడం, ఓటర్లు ఓటు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు వారు తెలిపారు. ఇంకా.. పార్కులు, మార్కెట్లు, మాల్స్ మరియు బహిరంగ ప్రదేశాలలో నిర్వహించే ప్రదర్శనల వద్ద అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీరు, పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులతో సహా వీల్ చైర్లో వెళ్లే ఓటర్లకు ర్యాంపులు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల భయంతో కొందరు ఓటర్లు బయటకు రావడం లేదని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. బూత్ల వద్ద క్యూలను వేగంగా కదిలేలా కొత్త పద్ధతులు, చర్యలు తీసుకుంటామన్నారు.
Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..
ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ హైదరాబాద్ నగరం గురించి ప్రజెంటేషన్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 45.65 తక్కువ పోలింగ్ శాతం నమోదైందన్నారు. యువకుల ఉదాసీనత, రోజువారీ వేతనాలు పొందే వారు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు బూత్లకు కేటాయించడం, అంతర్గత వలసలు మరియు క్యూలో వేచి ఉండటమే తక్కువ ఓటింగ్కు కారణమని చెప్పారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కమీషన్ సందేశాలను హైలైట్ చేసే పాటలను వినిపించేందుకు దాదాపు 4,500 స్వచ్చ ఆటోలు ఉపయోగిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్లను బూత్కు ఆహ్వానించేందుకు యువతను నియమించనున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే లక్నో, నాగ్పూర్ మరియు థానే వంటి ప్రధాన నగరాలకు సంబంధించిన సీఈవోలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు హాజరయ్యారు.
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!