KCR: కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు గ్యారెంటీలు, లేడీస్ కి స్కూటీలు లాంటి మీ మోసపూరిత వాగ్దానాల వల్ల వచ్చాయి అని పేర్కొన్నారు.
CPI: ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీపీఐ
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
రైతుల కోసం దేశంలో ఎవరు చేయని పనులు చేశాం.. రైతు బంధు ఇచ్చాం.. రైతు బీమా ఇచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్లకు తోక తెలియదు తొండం తెలియదని విమర్శించారు. కాళేశ్వరం పని అయిపోయింది అన్నోళ్లు మొన్న నీటిని ఎలా పంపింగ్ చేశారని దుయ్యబట్టారు. తాము వచ్చి పనులు చేస్తుంటే మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది.. ఆ మిడ్ మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ… తాము కోమటిరెడ్డిని జైల్లో పెట్టకపోదుమా..? అని ప్రశ్నించారు. గోదావరిలో నీళ్లు లేక ఆరు నెలలు వ్యాప్కోస్ తో కలిసి కష్టపడి ప్రాజెక్ట్ డిజైన్ చేశామన్నారు. ఏ టైంలో నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోయాలో ఆలోచించి పని చేస్తే మే నెలలో మత్తళ్ళు దూకినాయని పేర్కొన్నారు. అప్పటి ఇంజనీర్లని అడిగితే మమ్మల్ని నిరోధించారు అంటున్నారు.. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్ నదుల్లో ఇది సహజం అని తెలిపారు.
Seethakka: ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
వీళ్లకు చేతగాకపోతే 50 వేల మంది రైతుల్ని తీసుకుని వీళ్లను తొక్కుకుంటా పోయి కుర్చీ వేసుకుని కూర్చుని మేడిగడ్డ నుంచి నీటిని తెస్తామని కేసీఆర్ తెలిపారు. తాము హైదరాబాద్ సహా రాష్ట్రమంతా ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చాం నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ రోడ్ల మీదికి బిందెలు వస్తున్నాయి… ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి.. ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి… మిషన్ భగీరథ తిరిగి నడపండి అని అన్నారు. వెంటనే చర్యలు చేపట్టి 25 వేలు ఎకరాకు పరిహారం ఇవ్వాలి.. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు… ఒక్క జిల్లా రెండు జిల్లాలు కాదు.. ఎక్కడ సమస్య వున్నా.. అక్కడ గద్దలాగా వాలిపోతానని తెలిపారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!