Kashibugga Stampede: కాశిబుగ్గ ప్రమాదం అందరి మనసులను కలిచివేసింది: మంత్రి ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి చెందటం చాలా బాధాకరం అని చెప్పారు. ఈ దేవస్థానం ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ కింద ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగతంగా నిర్మించుకుని నిర్వహిస్తున్న ఆలయం అని చెప్పారు.
READ ALSO: November 2025 IPOs: నవంబర్ నెలలో నాలుగు ఐపీఓలు.. ఏయే కంపెనీలో తెలుసా !
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు, ఉత్సవాల జరుగుతున్నాయనేది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం లేదని చెప్పారు. ఆలయ కమిటీ వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి మంచి ఉద్దేశంతో దేవస్థానాన్ని నిర్మించిన ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం అయితే ఉందని పేర్కొన్నారు. ఆ ఆలయానికి దేవాదాయ శాఖ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవని వెల్లడించారు. ఆ దేవస్థానం మున్సిపల్ పరిధిలో ఉందని, కానీ ఆలయానికి మున్సిపల్ శాఖ నుంచిఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయానికి పోలీసుల పరిమిషన్ కూడా లేదని చెప్పారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో వేలాదిగా ప్రజలు వస్తారని తెలిసి కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే జిల్లాలో ఎస్పీ ఏకాదశిని, కార్తీకమాసం పురస్కరించుకుని ఏ ఆలయాల్లో రద్దీ ఎక్కువ ఉంటుదో ఊహించి ముందుచూపుతో కొంతమంది కానిస్టేబుళ్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు ఎప్పుడు జరగలేదని, నిర్వాహకులకు కూడా ఇంత జనం వస్తారని ఊహించకుండా ఆలోచన లేకుండా ఉండటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. ఇప్పటికే స్థానిక మంత్రి అచ్చం నాయుడు, శాసనసభ్యులు గౌతు శిరీష ఉదయం నుంచి అక్కడే ఉండి కలెక్టర్, ఎస్పీలతో కలిసి అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం నుంచి కాశీబుగ్గకు బయలుదేరి వెళ్లారని పేర్కొన్నారు. వారు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి తదుపరి సహాయక చర్యలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలు సమగ్రంగా సమీక్షించుకుని అచ్చం నాయుడు , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి, స్థానిక శాసనసభ్యులు శిరీష తో మాట్లాడిన తర్వాత అవసరమైన నివేదికను తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!