Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kashibugga Temple Stampede Minister Anam Reaction Srikakulam Tragedy

Kashibugga Stampede: కాశిబుగ్గ ప్రమాదం అందరి మనసులను కలిచివేసింది: మంత్రి ఆనం

Published Date :November 1, 2025 , 10:17 pm
By Shiva Ganesh
Kashibugga Stampede: కాశిబుగ్గ ప్రమాదం అందరి మనసులను కలిచివేసింది:  మంత్రి ఆనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి చెందటం చాలా బాధాకరం అని చెప్పారు. ఈ దేవస్థానం ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ కింద ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగతంగా నిర్మించుకుని నిర్వహిస్తున్న ఆలయం అని చెప్పారు.

READ ALSO: November 2025 IPOs: నవంబర్‌ నెలలో నాలుగు ఐపీఓలు.. ఏయే కంపెనీలో తెలుసా !

Also Read

  • Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్‌ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
  • South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్‌ప్రైజ్ గెజిట్..
  • Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు, ఉత్సవాల జరుగుతున్నాయనేది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం లేదని చెప్పారు. ఆలయ కమిటీ వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి మంచి ఉద్దేశంతో దేవస్థానాన్ని నిర్మించిన ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం అయితే ఉందని పేర్కొన్నారు. ఆ ఆలయానికి దేవాదాయ శాఖ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవని వెల్లడించారు. ఆ దేవస్థానం మున్సిపల్ పరిధిలో ఉందని, కానీ ఆలయానికి మున్సిపల్ శాఖ నుంచిఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయానికి పోలీసుల పరిమిషన్ కూడా లేదని చెప్పారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో వేలాదిగా ప్రజలు వస్తారని తెలిసి కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే జిల్లాలో ఎస్పీ ఏకాదశిని, కార్తీకమాసం పురస్కరించుకుని ఏ ఆలయాల్లో రద్దీ ఎక్కువ ఉంటుదో ఊహించి ముందుచూపుతో కొంతమంది కానిస్టేబుళ్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు ఎప్పుడు జరగలేదని, నిర్వాహకులకు కూడా ఇంత జనం వస్తారని ఊహించకుండా ఆలోచన లేకుండా ఉండటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. ఇప్పటికే స్థానిక మంత్రి అచ్చం నాయుడు, శాసనసభ్యులు గౌతు శిరీష ఉదయం నుంచి అక్కడే ఉండి కలెక్టర్, ఎస్పీలతో కలిసి అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం నుంచి కాశీబుగ్గకు బయలుదేరి వెళ్లారని పేర్కొన్నారు. వారు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి తదుపరి సహాయక చర్యలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలు సమగ్రంగా సమీక్షించుకుని అచ్చం నాయుడు , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి, స్థానిక శాసనసభ్యులు శిరీష తో మాట్లాడిన తర్వాత అవసరమైన నివేదికను తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anam ram narayana reddy
  • Andhra Pradesh News
  • AP Latest News
  • Kashibugga stampede
  • Kashibugga temple deaths

తాజావార్తలు

  • Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్‌ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..

  • Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..

  • EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్

  • West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్‌ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్

  • South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్‌ప్రైజ్ గెజిట్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions