Karimnagar: కరీంనగర్ లో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా పర్యవేక్షించారు. పార్లమెంటు స్థానానికి మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు దాఖలు చేశారు. క్రమ పద్ధతిలో వాటిని పరిశీలించి వివరాలు, పత్రాలు సక్రమంగా ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు. లోపాలున్నా, సరిగా వివరాలు సమర్పించని 20 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఒక్కొక్క నామినేషన్ పత్రానికి సంబంధించి వివరాలు.. పత్రాలు సక్రమంగా ఉన్నాయా.. లేదా అని జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు మాత్రం తిరస్కరణకు గురికాలేదు. 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వివరాలు సరిగా లేని 20 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 33 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
READ MORE: Jasprit Bumrah: ఏంటి బుమ్రా ఆ ప్రాక్టీస్.. ఓపెనర్గా రాబోతున్నావా ఏంటి..? వీడియో వైరల్..
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
ఎందుకు నామినేషన్ తిరస్కరణకు గురైందో అందుకు సంబంధించిన వివరాలను కూడా అభ్యర్థులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం శనివారం, ఆదివారం సెలవు ఉంటుందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ఉపసంహరణకు చాన్స్ ఉండదని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరి పాటించాలని పేర్కొన్నారు.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- congress
- karimnagar
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!