Kakarla Suresh: వృద్ధులకు, వికలాంగులకు ఇతర పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ అందివ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ టీడీపీ జనసేన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
Rajasthan High Court: వివాహేతర శృంగారం నేరం కాదు..
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వాలంటీర్లు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎద్దేచ్ఛగా ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మరోవైపు వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్మును వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచిపెట్టి ఖజానా ఖాళీ చేసిందని తెలిపారు. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతోందని దుయ్యబట్టారు.
AAP: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్
సుమారు 1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల మంది పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించటం పెద్ద కష్టం కాదని.. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం సచివాలయాల్లోని పెన్షన్లు పంపిణీకి ఆదేశాలు ఇచ్చిందని కాకర్ల సురేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం స్వార్థ రాజకీయం వల్ల మండుటెండల్లో వయోవృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కనుక సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శి సేవలు వినియోగించుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే యుద్ధ ప్రాతిపదికను పింఛన్లను అందించాలని కోరుతున్నట్లు కాకర్ల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, జనసేన జోన్ కన్వీనర్ పొట్టి వెంకటేశ్వర్లు, చేజర్ల సుబ్బారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, గూడ నరసారెడ్డి తదితరులు ఉన్నారు.
- Tags
- Kakarla Suresh
- MPDO
- pension
- Petition
- tdp
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!