AAP: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అభ్యర్థులతో కూడా జాబితా అధిష్టానం విడుదల చేసింది. హోషియార్పూర్ నుంచి రాజ్ కుమార్ చబ్బెవాల్, ఆనంద్పూర్ సాహిబ్ నుంచి మల్వీందర్ సింగ్ కాంగ్ పోటీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Purandeswari: ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో ఆప్ సీట్ల షేరింగ్ జరిగింది. ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. పంజాబ్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Jagan: డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీసియల్ కస్టడీ విధించింది. దీంతో సోమవారం ఆయన్ను తీహార్ జైలుకు పంపించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్ను జైల్లో పెట్టడంతో పార్టీ ప్రచారం సన్నగిల్లింది. నేతలంతా కేజ్రీవాల్పైనే పోకస్ పెట్టారు. దీంతో ప్రచారాన్ని ముందుకు నడిపించేవారు లేక డీలా పడింది. ఇక ఇదే కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!