Duleep Trophy 2024: ఆ ఒక్కడికి మాత్రమే మినహాయింపు.. రోహిత్, విరాట్ కూడా ఆడాల్సిందే!
- 40 రోజుల వరకు సిరీస్లు లేవు
- సెప్టెంబర్ 19 నుంచి బంగ్లా టెస్టు సిరీస్
- సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Virat Kohli to Play Duleep Trophy 2024: శ్రీలంక పర్యటన అనంతరం 40 రోజుల వరకు భారత జట్టుకు ఎలాంటి సిరీస్లు లేవు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈలోగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్స్ అందరూ ఆడుతారని సమాచారం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా డొమిస్టిక్ క్రికెట్లో ఆడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సహా మిగతా క్రికెటర్లు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్కు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పేసర్ మహమ్మద్ షమీ సైతం ఆడతాడు. అయితే కేవలం ఒక్క క్రికెటర్కు మాత్రమే దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. పని ఒత్తిడి కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారట.
Also Read
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
Also Read: Bigg Boss 8 Promo: ఇక్కడ కమిట్ అయితే లిమిటే లేదు.. ‘బిగ్బాస్’ తెలుగు ప్రోమో అదిరిందిగా!
సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా సైతం దులీప్ ట్రోఫీలో ఆడనున్నారట. ఈ ఇద్దరు పరుగులు చేసినా.. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.
తాజావార్తలు
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!