Nobel Peace Prize: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన దేశంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మహిళా హక్కుల కోసం నినదించిన నర్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గానూ శాంతి బహుమతి ఇచ్చారు.