విద్యార్థులు టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో భాగంగా సోమవారం రెండో ఎపిసోడ్లో విద్యార్థులతో మోడీ చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇచ్చారు. మానవులు ఏఐకి భయపడాలా? వద్దా?.. చాలా కంపెనీలు మనుషులతో పాటు ఏఐ ఉద్యోగులను కూడా నియమించుకుంటుందని విద్యార్థులు ప్రశ్నించారు.

దీనికి మోడీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతి యుగంలో ఇలాంటి చర్చ జరుగుతుంటుందని.. కంప్యూటీర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందన్నారు. అయినా మనం దేనికి భయపడకూడదని హితవు పలికారు. ఇక చాలా మంది పిల్లలు మొబైల్కు బానిసలవుతున్నారని.. ఫోన్ లేకపోతే చాలా మంది తినడం లేదని కూడా విన్నాను. ఈ పద్ధతి మారాలని సూచించారు. ఎవరూ కూడా మొబైల్కు బానిసలు కాకుండా చూసుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని.. టెక్నాలజీ ద్వారా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
Episode 2 of Pariksha Pe Charcha is a special one. It features students from various cities across India. Do watch!#ParikshaPeCharcha26 https://t.co/GdUvEJw5rf
— Narendra Modi (@narendramodi) February 9, 2026