Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Industries Are Developing In Punjab Lakhs Of Youth Will Get Employmentkejriwal Said

CM Kejriwal: పంజాబ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. లక్షలాది మంది యువతకు ఉపాధి

Published Date :September 14, 2023 , 10:21 pm
By Rajesh Veeramalla
CM Kejriwal: పంజాబ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. లక్షలాది మంది యువతకు ఉపాధి
  • Follow Us :
  • google news
  • dailyhunt

గురువారం అమృత్‌సర్‌లో ప్రభుత్వ-సన్నత్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పారిశ్రామికవేత్తలతో సంభాషించారు. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అమృత్‌సర్‌ను గురువుల పవిత్ర భూమిగా పరిగణిస్తామన్నారు. ఈ పవిత్ర భూమి నుండి గురువుల ఆశీర్వాదంతో తాము పంజాబ్ మొదటి స్కూల్ ఆఫ్ ఎమినెన్స్‌ని ప్రారంభించామన్నారు. ఇప్పుడు తాము పరిశ్రమ, వాణిజ్యాన్ని విస్తరించడానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచం పురోగమిస్తోంది కానీ.. పంజాబ్ ఇప్పటికి వెనుకపడి ఉంది. ఇప్పుడు మనం దానిని మార్చాలన్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన ఐదేళ్లలోపు దీని సంఖ్యను 2 వేల యూనిట్లకు పెంచుతామన్నారు.

Vijay: తండ్రికి గుండె ఆపరేషన్.. విదేశాల నుంచి వచ్చిన హీరో

Also Read

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

ఎన్నికలకు ముందు టౌన్ హాల్ చేశామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో పలువురు పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలను తెలియజేసి సూచనలు కూడా చేశారు. పరిశ్రమకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చామని, నిజానికి అంతకు మించి చేశామని ఈరోజు పారిశ్రామికవేత్తల మధ్యకు వచ్చామని తెలిపారు. వ్యాపారవేత్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం రోడ్ల నిర్మాణానికి రూ.14-18 కోట్లకు సీఎం భగవంత్ మాన్ ఆమోదం తెలిపారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వెళ్లి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే గడిచిందని.. ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ పెట్టుబడి 2.86 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. పంజాబ్‌లో టాటా స్టీల్‌తో సహా అనేక ఇతర పెద్ద పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని కేజ్రీవాల్ అన్నారు.

Bandi Sanjay: జమిలి ఎలక్షన్స్ అంటే మీకు ఎందుకు అంత భయం..

అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ నెరవేరుతోందో లేదో చూసేందుకు వచ్చానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అందరూ వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏయే హామీలను నెరవేర్చారో చెప్పడానికే వచ్చామన్నారు. నేడు పంజాబ్‌లో 80-85 శాతం ఇళ్లకు ఉచిత విద్యుత్‌ అందుతోందని భగవంత్ మాన్ తెలిపారు. పరిశ్రమలకు సంబంధించి మాట్లాడుతూ.. పంజాబ్‌లో పరిశ్రమల విధానాన్ని రూపొందించామని భగవంత్‌ మాన్‌ అన్నారు. వ్యాపారులు ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రోడ్డు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా పంజాబ్ నిలుస్తుందని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amritsar
  • Arvind Kejriwal
  • Bhagwant Mann
  • industries
  • telugu news

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions