IND vs BAN: బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
- తొలి టెస్టు మ్యాచ్లో 280 పరుగుల తేడాతో భారీ విజయం.
- కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టు.
- రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా.. కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో, చివరి టెస్టు జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 (ICC WTC 2025 అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్)లో భాగం.
Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్!
Also Read
రెండో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టులో భాగమైన మొత్తం 16 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. అంటే రెండో టెస్ట్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ను ఓడించిన తర్వాత ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు 68.52 శాతం విజయంతో నంబర్వన్లో ఉంది. విజయం తర్వాత టీమిండియా విజయ శాతం ఇప్పుడు 71.67 కి పెరిగింది. WTC మూడో సైకిల్లో 10 మ్యాచ్ల్లో భారత్కు ఇది ఏడో విజయం. రెండు పరాజయాలను చవిచూడగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..
రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!