IND vs WI: రింకూ సింగ్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?.. బీసీసీఐని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh Fail To Find Place In Team India T20I Squad For WI Series: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐపీఎల్ 2023లో సత్తాచాటిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2023లోనే సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, నితీశ్ రాణా, జితేశ్ శర్మకు బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో అజిత్ అగార్కర్ బృందంపై ఫాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో రింకూ సింగ్ 14 మ్యాచులు ఆడి 474 పరుగులు చేసాడు. 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో రన్స్ బాదాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది కేకేఆర్ జట్టుకి ఊహించని విజయాన్నందించాడు. 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ.. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో నిలిచాడు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Also Read: India vs Pakistan Records: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్-పాకిస్తాన్ గత రికార్డ్స్ ఇవే! టీమిండియాదే..
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడంపై బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. రింకూ సింగ్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ‘టీ20 జట్టులోకి వచ్చేందుకు రింకు సింగ్ అర్హుడు’, ‘రింకు సింగ్ లేకుండా జట్టు ఎంపిక చేయడమా?’, ‘టీ20 సిరీస్కు రింకు సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేది’ అని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. రింకు సింగ్ పేరును బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలించకపోవడంపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. రింకు సింగ్కు భారత జట్టులోకి వచ్చే సమయం త్వరలోనే వస్తుంది అని ట్వీట్ చేశాడు.
ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. దాంతో రింకూ సింగ్, నితీశ్ రాణాలకు చోటు దక్కలేదు. ఇక ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వికెట్ కీపర్ల కోటాలో ముందుండటంతో జితేశ్ శర్మకు అవకాశం రాలేదు.
Also Read: Virat Kohli Out: ఉనాద్కత్ బౌలింగ్లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!