IND vs WI: రింకూ సింగ్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?.. బీసీసీఐని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh Fail To Find Place In Team India T20I Squad For WI Series: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐపీఎల్ 2023లో సత్తాచాటిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2023లోనే సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, నితీశ్ రాణా, జితేశ్ శర్మకు బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో అజిత్ అగార్కర్ బృందంపై ఫాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో రింకూ సింగ్ 14 మ్యాచులు ఆడి 474 పరుగులు చేసాడు. 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో రన్స్ బాదాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది కేకేఆర్ జట్టుకి ఊహించని విజయాన్నందించాడు. 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ.. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో నిలిచాడు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
Also Read: India vs Pakistan Records: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్-పాకిస్తాన్ గత రికార్డ్స్ ఇవే! టీమిండియాదే..
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడంపై బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. రింకూ సింగ్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ‘టీ20 జట్టులోకి వచ్చేందుకు రింకు సింగ్ అర్హుడు’, ‘రింకు సింగ్ లేకుండా జట్టు ఎంపిక చేయడమా?’, ‘టీ20 సిరీస్కు రింకు సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేది’ అని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. రింకు సింగ్ పేరును బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలించకపోవడంపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. రింకు సింగ్కు భారత జట్టులోకి వచ్చే సమయం త్వరలోనే వస్తుంది అని ట్వీట్ చేశాడు.
ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. దాంతో రింకూ సింగ్, నితీశ్ రాణాలకు చోటు దక్కలేదు. ఇక ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వికెట్ కీపర్ల కోటాలో ముందుండటంతో జితేశ్ శర్మకు అవకాశం రాలేదు.
Also Read: Virat Kohli Out: ఉనాద్కత్ బౌలింగ్లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!