India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల…
కేరళ స్టోరీ-2 రిలీజ్కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు.. విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్.. స్పందించిన కవిత.. కీలక వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో…
టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలే ఖచంద్ర ఆరోగ్యం విషమించడంతో నొయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ కారణంగా జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్కు ముందు రింకూ జట్టును వీడాడు. దాంతో అతడు బిగ్ మ్యాచ్ మిస్ అయ్యాడు. రింకూ జీవితంలో వరుసగా నాలుగు రోజుల్లో జరిగిన సంఘటనలు అతడిని తీవ్రంగా కలచివేశాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకేసారి…
Indian Cricketer Rinku Singh Father Death: భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్న ఖచంద్ర ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి.. చికిత్స అందించారు. క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉండడంతో ఆయన శారీరం సహకరించక తిరిగిరాని లోకాలకు…
Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం…
T20 World Cup 2026 India: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది. LG Gram 14: అల్ట్రా…
Hardik Pandya ‘No-Look’ wicket: కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ను 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో టర్నింగ్ పాయింట్ అంటే.. పవర్ప్లేలో భారత బౌలర్ల దూకుడను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..…
Rinku Singh: ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. అతని ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో తొలి రోజే టీమిండియా అమెరికా (USA)తో మ్యాచ్ ఆడనుంది. T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు…
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమవుతుంది. నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 37 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వన్డే సిరీస్ విజయం అందుకున్న కివీస్.. టీ20 సిరీస్ కూడా కొట్టాలని చూస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ పొట్టి సిరీస్ అయినా పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తొలి…