IND vs PAK: ఆడండి, వెళ్లండి.. బీసీసీఐకి మరో ఆఫర్ ఇచ్చిన పీసీబీ!
- పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్తాన్కు వెళ్లేది లేదంటున్న భారత్
- మరో ఆఫర్ ఇచ్చిన పీసీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025 Update: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న, ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్కు టీమిండియా వెళ్లేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తాము పాకిస్తాన్కు రామని, హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. దాంతో భారత్ ఆడే మ్యాచ్లతో పాటు.. టీమిండియా సెమీస్, ఫైనల్కు చేరుకుంటే వేదికలు కూడా మారిపోతాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల కొట్టిపడేసింది. అలాంటి ఆలోచన తాము చేయడం లేదంటూ వెల్లడించింది. తాజాగా మరో ఆఫర్తో బీసీసీఐకి ముందుకు పీసీబీ వచ్చింది.
Also Read
- Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
Also Read: Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు
ఓ స్పోర్ట్స్ ఛానెల్ కథనం ప్రకారం.. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్లో భారత జట్టు ఉండటానికి ఇష్టపడకపోతే, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత తిరిగి భారత్కు టీమ్ వెళ్లొచ్చని బీసీసీఐకి పీసీబీ ఓ లేఖ రాసిందట. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అనంతరం న్యూ ఢిల్లీ లేదా చండీగఢ్కు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లను చేస్తామని ప్రతిపాదించిందట. భారత జట్టు న్యూ ఢిల్లీ లేదా మొహాలీలో క్యాంప్ను ఏర్పాటు చేసుకోవచ్చని, మ్యాచ్ల కోసం లాహోర్కు వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్లను ఏర్పాటు చేస్తామని తెలిపిందట. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ పర్యటన వెళ్లగా.. ఛాంపియన్స్ ట్రోఫీ అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చిందని పేర్కొంది.
తాజావార్తలు
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..