HYDRA: హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..!
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నాం- రంగనాథ్
- 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది- రంగనాథ్
- హైడ్రా కు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు- హైడ్రా కమిషనర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాము.. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ (FTL) పరిధి మార్చినా కూడా.. వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు. అలాగే.. శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశం అవుతున్నాం.. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. హైడ్రా కేవలం డిమాలేషన్ కోసమే అన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతుంది.. అంతేకాకుండా హైడ్రా కోసం ఒక FM ఛానెల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. నోటరీ ఉన్న వాటిని కొనెప్పుడు ప్రజలు ఆలోచించాలి.. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Legally Veer : లీగల్లీ వీర్ ముఖ్య ఉద్దేశం అదే : హీరో వీర్ రెడ్డి
అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇళ్ళు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, FTLలో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదు.. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది.. 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు.. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారు.. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారని అన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!