Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
- మన్మోహన్ స్మారకంపై రాజకీయ దుమారం..
- బీజేపీ రాజకీయం చేస్తోందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరణించారు. అయితే, ఆయన మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయింపుపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. అధికార బీజేపీ రాజకీయాలు ఆడుతోందని ఆరోపించారు. ఒక వేళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి రాజ్ఘాట్లో స్మారక చిహ్నం లేకపోతే ఆ పార్టీకి ఎలా అనిపించేదని ప్రశ్నించారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని, యావత్ దేశ చరిత్రకు సంబంధించిందని ఆయన అన్నారు.
‘‘ఒక వ్యక్తి చనిపోయాక, అతనిపై ఉన్న శత్రుత్వాలు అన్ని నశిస్తాయి. కానీ ఇక్కడ రాజకీయం జరుగుతోంది. అటల్ జీ అంత్యక్రియలు తర్వాత స్మారక చిహ్నం రాజ్ఘాట్ వద్ద నిర్మించబడదని, వేరే చోట నిర్మిస్తామని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది.? ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశ చరిత్రకు సంబంధించింది’’ అని సిద్ధూ విలేకరుల సమావేశంలో అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కేటాయింపు అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీని నిందించారు. రాజ్ఘాట్ కాకుండా నిగంబోధ్ ఘాట్లో ఏ మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. దేశం మొత్తం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలోనే ఆయన స్మారకం నిర్మించాలని కోరుకుందని, ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, పంజాబ్, సిక్కులు, ఈ దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల డిమాండ్ అని అన్నారు. దీని గురించి ముందుగానే ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బీజేపీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు వెతుకుతోందని అన్నారు. మాజీ ప్రధానిని ఎప్పుడూ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం కానీ ఏ నాయకుడిని గౌరవించకపోవడం కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మదన్ మోహన్ మలవియా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న ఇచ్చి మోడీ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!