Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
- మన్మోహన్ స్మారకంపై రాజకీయ దుమారం..
- బీజేపీ రాజకీయం చేస్తోందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరణించారు. అయితే, ఆయన మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయింపుపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. అధికార బీజేపీ రాజకీయాలు ఆడుతోందని ఆరోపించారు. ఒక వేళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి రాజ్ఘాట్లో స్మారక చిహ్నం లేకపోతే ఆ పార్టీకి ఎలా అనిపించేదని ప్రశ్నించారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని, యావత్ దేశ చరిత్రకు సంబంధించిందని ఆయన అన్నారు.
‘‘ఒక వ్యక్తి చనిపోయాక, అతనిపై ఉన్న శత్రుత్వాలు అన్ని నశిస్తాయి. కానీ ఇక్కడ రాజకీయం జరుగుతోంది. అటల్ జీ అంత్యక్రియలు తర్వాత స్మారక చిహ్నం రాజ్ఘాట్ వద్ద నిర్మించబడదని, వేరే చోట నిర్మిస్తామని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది.? ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశ చరిత్రకు సంబంధించింది’’ అని సిద్ధూ విలేకరుల సమావేశంలో అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కేటాయింపు అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీని నిందించారు. రాజ్ఘాట్ కాకుండా నిగంబోధ్ ఘాట్లో ఏ మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. దేశం మొత్తం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలోనే ఆయన స్మారకం నిర్మించాలని కోరుకుందని, ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, పంజాబ్, సిక్కులు, ఈ దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల డిమాండ్ అని అన్నారు. దీని గురించి ముందుగానే ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బీజేపీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు వెతుకుతోందని అన్నారు. మాజీ ప్రధానిని ఎప్పుడూ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం కానీ ఏ నాయకుడిని గౌరవించకపోవడం కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మదన్ మోహన్ మలవియా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న ఇచ్చి మోడీ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!