CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: 2010లో ఒడిశాలో ధరణి ప్రారంభమైంది.. కానీ, కేసీఆర్ నేనే ధరణి తెచ్చానని చెప్పుకున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తాజాగా అసెంబ్లీలో సీఎం ప్రసంగిచారు. ఒడిశాలో ధరణిని కాగ్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందన్నారు. అయినా కేసీఆర్ ధరణిని తెచ్చి పెట్టారని.. ధరణితో దందాలకు తెరలేపారని ఆరోపించారు. ధరణి చిట్టా చెప్పాలనే కేసీఆర్ను పదే పదే సభకు రావాలని అడిగానన్నారు. కానీ.. బబుల్ షూటర్ కేసీఆర్ను సభకు రావొద్దని చెప్పారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ పేరు పెట్టారని.. అది బయటపడుతుందనే సభ నుంచి పారిపోయారని సీఎం వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ వచ్చాక మండలస్థాయిలో ఉన్న రికార్డులు కలెక్టరేట్కు వెళ్లాయి.. డిజిటలైజ్ పేరుతో రికార్డులన్నింటినీ కలెక్టరేట్లకు తరలించారు.. అక్కడే కుట్ర చేశారు.. ఇప్పుడు ఆ రికార్డులు ఉన్నాయో లేవో తెలియదు.. భూదాన్ భూములు కూడా కబ్జా జరిగాయి, వాటిని కూడా బయటపెడతా.. ఆనాడు కాంగ్రెస్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది.. భూముల కోసం పోరాటం చేసింది ఎర్రజెండా అయితే.. పంచింది కాంగ్రెస్.. అసైన్డ్ భూములను రక్షించేందుకు బదిలీలను సైతం నిషేధించింది.. పేదలు భూ హక్కులు అనుభవిస్తున్నారంటే.. దానికి కారణం ఇందిరాగాంధీ. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది అంటున్నారు. 98 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. అటవీ, అసైన్డ్, దేవాదాయ భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. ఇందులో నుంచి ఒక్క ఇంచ్ భూమి కూడా తీయొద్దు. ఇంచు భూమి తీసే అధికారం ప్రభుత్వానికి ఉందా.. తీస్తే ప్రభుత్వం ఉంటుందా.? ప్రైవేట్ వ్యక్తుల 3 లక్షల 77 వేల ఎకరాల భూముల మీదనే పంచాయితీ. మాక్ అసెంబ్లీలో కూడా స్పీకర్ దళితుడు అని కేసీఆర్ పోలేదు. అగ్గిపెట్టెరావు కోటి ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించండిఅని కేసీఆర్తో లేఖ రాయించండి. మేం భూములు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు కొల్లగొట్టడానికి ఏం చేశారో కూడా చెబుతా అని గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. 2025లోని రికార్డులు సెట్ చేసి.. సమస్య పరిష్కారం కోసం భూభారతి తెచ్చామని వెల్లడించారు. 22A తాము తెచ్చింది కాదని.. ఉమ్మడి ఏపీలో తెచ్చిన చట్టన్నారు. 1999లోనే 22A తెచ్చారు. 22A చట్టం తీసుకొచ్చారు కానీ.. ఏ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలో స్పష్టత లేదన్నారు.
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!