HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా
- బడంగ్ పేట్ లో హైడ్రా దూకుడు
- అల్మాస్ గూడలో పార్కు స్థలం ఆక్రమణ
- హైడ్రాకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైడ్రా (Hyderabad Water Resources Development and Reclamation Authority) హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను రక్షించి, వాటిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ. ఈ సంస్థ పారిశుద్ధ్య పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, పర్యావరణాన్ని సంరక్షించడం లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందినా అక్కడ అక్రమార్కుల భరతం పడుతున్నారు హైడ్రా అధికారులు. ఈ నేపథంల్యోనే.. బడంగ్పేట కార్పొరేషన్లో హైడ్రా కొరడా ఝుళిపించింది. అల్మాస్గూడ 5వ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసులు ఈ సమస్యను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి నివేదించారు. గతంలో ఈ ఘటనపై కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోవడం లేదని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న లక్ష్మారెడ్డి, హైడ్రా, మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆటపరికరాలను తిరిగి ఏర్పాటు చేశారు. హైడ్రా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఇతర పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలోనే చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో బడంగ్పేటలో భూకబ్జాదారులకు గట్టి హెచ్చరిక వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకొని, పార్కు స్థలాన్ని కాపాడినందుకు వెంకటేశ్వర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాలభిషేకం చేశారు.
Nargis Fakhri Sister: బ్రేకప్ చెప్పాడని కాల్చి చంపిన హీరోయిన్ చెల్లి అరెస్ట్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!