HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా
- బడంగ్ పేట్ లో హైడ్రా దూకుడు
- అల్మాస్ గూడలో పార్కు స్థలం ఆక్రమణ
- హైడ్రాకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైడ్రా (Hyderabad Water Resources Development and Reclamation Authority) హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను రక్షించి, వాటిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ. ఈ సంస్థ పారిశుద్ధ్య పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, పర్యావరణాన్ని సంరక్షించడం లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందినా అక్కడ అక్రమార్కుల భరతం పడుతున్నారు హైడ్రా అధికారులు. ఈ నేపథంల్యోనే.. బడంగ్పేట కార్పొరేషన్లో హైడ్రా కొరడా ఝుళిపించింది. అల్మాస్గూడ 5వ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసులు ఈ సమస్యను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి నివేదించారు. గతంలో ఈ ఘటనపై కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోవడం లేదని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న లక్ష్మారెడ్డి, హైడ్రా, మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆటపరికరాలను తిరిగి ఏర్పాటు చేశారు. హైడ్రా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఇతర పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలోనే చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో బడంగ్పేటలో భూకబ్జాదారులకు గట్టి హెచ్చరిక వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకొని, పార్కు స్థలాన్ని కాపాడినందుకు వెంకటేశ్వర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాలభిషేకం చేశారు.
Nargis Fakhri Sister: బ్రేకప్ చెప్పాడని కాల్చి చంపిన హీరోయిన్ చెల్లి అరెస్ట్
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?