Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన
గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళుతుండగా బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోతున్న దృశ్యాలు వినాశకరమైనవి” అని రాసుకొచ్చారు. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన సమాచారం తెలుసుకున్నాము. “వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి, మద్దతు అందించడానికి మేము స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాము” అని బ్రిటిష్ హైకమిషన్ Xలో పోస్ట్ చేసింది.
Also Read:Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
ఈ ప్రమాదంలో బాధితులకు బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ సంతాపం తెలిపారు. “భారత్ లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వార్త నన్ను తీవ్రంగా బాధించిందన్నారు. భారత్ లోని రష్యా రాయబారి ఈ ఘటన “హృదయ విదారకం” అని అన్నారు. బాధిత కుటుంబాలకు, భారత ప్రజలకు సానుభూతి తెలిపారు. “అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై ఫ్రాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో మేము మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము” అని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ తెలిపారు.
Also Read:Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, “ఈ దుఃఖ సమయంలో యూరప్ మీకు, భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది” అని అన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సర్, విమాన ప్రమాదం గురించి విని తాను “తీవ్ర బాధపడ్డాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?