Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
- ప్రమాద సమయంలో విమానంలో 80-90 టన్నుల ఇంధనం..
- ఫ్యూయల్ డంప్ చేసే సమయం కూడా లేదు..
- దీంతోనే భారీగా ఎగిసిపడిన మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. విమానం 825 అడుగుల ఎత్తు నుంచి నేలను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
Read Also: Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
ఇదిలా ఉంటే, ప్రమాదం సమయంలో విమానంలో 80-90 టన్నుల ఇంధనం ఉందని తెలుస్తోంది. దీంతోనే, విమానం నేలను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. విమానం దాదాపుగా బూడిదైంది. పైలట్లు ప్రమాదానికి ముందు ఏటీసీకి అత్యవసరం సందేశం ‘‘మేడే’’ కాల్ చేశారు. దీని తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ వెల్లడించింది.
నిజానికి విమానం నుంచి ‘‘ఫ్యూయల్ డంప్’’ చేసే సమయం కూడా పైలట్లకు లేకుండా పోయింది. టేకాఫ్ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ముందుగా విమానం నుంచి ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేస్తారు. కానీ, ఎయిర్ ఇండియా విమానానికి అంత సమయం లేదని వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే తెలుస్తోంది. ఈ కారణాల వల్లే ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..