Air India Plane Crash: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అందరిని కలచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలింది. ఒక్కసారిగా నేలను ఢీ కొట్టడంతో విమానం అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 100కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల వివరాలను ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు.
READ ALSO: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్పందించిన యుకె ప్రధాని.. ఏమన్నారంటే?
ఇదిలా ఉంటే, ఈ విమానం ముందుగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఆ తర్వాతే లండన్ బయలుదేరింది. ప్రమాదానికి 2 గంటల ముందు ఈ విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణించి ఆకాష్ వాస్త అనే ప్యాసింజర్ విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్లు ఎక్స్లో తెలిపారు. విమానంలో పరిస్థితిని ఆకాష్ వీడియో తీశారు. ఏసీలు పనిచేయడం లేదని, అస్తవ్యస్తంగా ఉందని ఆకాష్ అన్నారు. ఇలాంటి విమానాలను ఎయిర్ ఇండియా ఎందుకు నడుపుతుందని ప్రశ్నించారు. టచ్ స్క్రీన్స్, లైట్స్ పనిచేయడం లేదని అన్నారు. మరిన్ని వివరాలు కావాలంటే తనను సంప్రదించాలని ఆయన ఎక్స్లో కోరారు.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025