India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Imports: భారత్ జూన్ నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. సముద్ర, వస్తు సమాచార సంస్థ క్లెపర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 19 వరకు భారత్ రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే 39 శాతం అధికం. దీంతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి దిగుమతులు కూడా అధిక స్థాయిలో కొనసాగాయి. జూన్లో రోజుకు సుమారు 6.36 లక్షల బ్యారెళ్ల చమురు భారత్కు చేరగా, మేలో ఇది 6.44 లక్షల బ్యారెళ్లుగా నమోదైంది. వెనిజులా రోజుకు 2.09 లక్షల బ్యారెళ్ల సరఫరాతో నాలుగో అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది. సౌదీ అరేబియా నుంచి రోజుకు 3.84 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతైంది.
మరోవైపు అమెరికా నుంచి చమురు దిగుమతులు భారీగా తగ్గాయి. మే నెలలో రోజుకు 2.52 లక్షల బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు జూన్లో కేవలం 91 వేల బ్యారెళ్లకు పడిపోయాయి. ఈ మార్పు భారత్ తన ఇంధన వనరులను విభిన్నీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రతిబింబిస్తోంది. రష్యా చమురు తక్కువ ధరలకు లభిస్తుండటంతో భారత రిఫైనరీలు దానిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అలాగే హర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ నుంచి కొనుగోళ్లు పెంచడం ద్వారా సరఫరా అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశాయి.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన దిగుమతిదారైన భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం, సహజ వాయువు అవసరాల్లో సగం, ఎల్పీజీ అవసరాల్లో 65 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా-ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధిలో నౌకాయాన కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి. దీంతో భారత్కు ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాలపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!