Hyderabad: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
- నాంపల్లి.. బేగంబజార్.. మోజం జై మార్కెట్.. అబిడ్స్.. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
- ఉదయం నుండి రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
- నిదానంగా కదులుతున్న వాహనాలు
- గణేష్ నిమజ్జనం.. హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన సిటీ జనం.
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుండి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. గణేష్ నిమజ్జనం, హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు సిటీ జనం. మరోవైపు.. మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.
Read Also: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మరోవైపు.. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మేయర్ విజయలక్ష్మి ఎన్టీవీతో మాట్లాడారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ట్యాంక్బండ్ తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువులల్లో నిమజ్జనాలు జరగనున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నాం.. నిమజ్జనంపై తొలిసారి సీఎం రివ్యూ చేశారు.. సలహాలు సూచనలు చేశారు.. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి.. పోలీసులు చూసుకుంటారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
Read Also: Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసి సిబ్బందికి సహకరించండని తెలిపారు. పదిహేను వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనం డ్యూటీల్లో పాల్గొంటున్నారు.. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్.. హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ డిప్లై చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.. రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసి సిబ్బందికి అసలైన పని ఉంటుందని ఆమ్రపాలి తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో