Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..
- ‘‘వందే మెట్రో రైల్’’ పేరుని మార్చిన రైల్వే మంత్రిత్వ శాఖ..
- ఇకపై ‘‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’’గా పిలవాలి..
- ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం..
- భుజ్-అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనున్న హై టెక్ ట్రైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namo Bharat Rapid Rail: భారత రైల్వేలు అధునాతనంగా మారుతున్నాయి. ఇప్పటికే పట్టాలపై వందేభారత్ సెమీ హై స్పీడ్ ట్రైన్ పరుగులు తీస్తోంది. మరోవైపు వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ప్రారంభించేందు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ‘‘వందే మెట్రో రైలు’’ని ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
అయితే, ఈ రైలు పేరును మారుస్తు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందే మెట్రో రైలుని ‘‘ నమో భారత్ ర్యాపిడ్ రైలు’’గా పేరు మార్చినట్లు రైల్వే మంత్రిత్వ శఆఖ వర్గాలు తెలిపాయి. దేశంలో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ఈ రైలు భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనునుంది. ఇంటర్ సిటీల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ రైలుని తీసుకువచ్చారు. తొలి రైలు ఈ రెండు నగరాల మధ్య 359 కి.మీ ప్రయాణించనుంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Uttar Pradesh: అపాచీ బైక్, 3 లక్షలు ఇవ్వలేదని భర్త దారుణం..
“వందే మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్గా మార్చాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఇతర మెట్రోలు తక్కువ దూరమే ప్రయాణిస్తుండగా, నమో భారత్ రైళ్లు మాత్రం నగరాలు, పట్టణాల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రూపొందించారు. మొత్తం 12 కోచ్లు కలిగిన ఈ రైలు 1150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఉంది.
“ఎర్గోనామిక్గా డిజైన్ చేయబడిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లు మరియు మాడ్యులర్ ఇంటీరియర్స్తో, ఇది ఖచ్చితంగా ఇతర మెట్రోల కంటే మెరుగైనదని రుజువు చేస్తుంది” అని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సబర్బన్ రైళ్లు, మెట్రో కోచ్ల నుంచి ముఖ్యమైన అప్గ్రేడ్స్ ఈ రైలులో కనిపిస్తున్నాయి. ఇందులో ఎజెక్టర్ ఆధారిత వాక్యూమ్ ఎవాక్యుయేషన్ టాయిలెట్లు ఉన్నాయి. రైలు మధ్య-దూర నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాలను అందిస్తుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?