Supreme Court: బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024: బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ( Supreme Court ) వెబ్సైట్లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించనుంది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ మధుర జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
కాగా, ఇందులో ఈవీఎంల ( EVMS) ద్వారా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్కు హక్కు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 61ఏను రద్దు చేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ విజ్ఞప్తి చేసింది. బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సులను అడ్డుకోవడం, అక్రమ ఓట్లు, పేపర్ వృధా లాంటి బ్యాలెట్ పేపర్పై ( Ballot Paper ) వాదనలు అన్యాయమైనవి అని తెలిపింది. అయితే ఈవీఎం ( EVMS) మెషీన్లో 2,000 నుంచి 3,840 ఓట్లు నిల్వ ఉన్నాయని పిటిషన్లో చెప్పుకొచ్చింది. అంటే ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఒక్కో నియోజకవర్గానికి 50 ఈవీఎం ( EVMS) మిషన్ల డేటాను తారుమారు చేయడం ద్వారా లక్ష నుంచి 1.92 లక్షల ఓట్ల వరకు మోసం జరిగే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్తో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉండటంతో ఈవీఎంల పనితీరుపై, అలాగే అధికార పార్టీపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నదని కాంగ్రెస్ (Congress) పిటిషన్లో పేర్కొనింది. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ( Supreme Court ) ధర్మాసనం విచారణ చేయనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!