Supreme Court: బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024: బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ( Supreme Court ) వెబ్సైట్లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించనుంది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ మధుర జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
Also Read
కాగా, ఇందులో ఈవీఎంల ( EVMS) ద్వారా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్కు హక్కు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 61ఏను రద్దు చేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ విజ్ఞప్తి చేసింది. బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సులను అడ్డుకోవడం, అక్రమ ఓట్లు, పేపర్ వృధా లాంటి బ్యాలెట్ పేపర్పై ( Ballot Paper ) వాదనలు అన్యాయమైనవి అని తెలిపింది. అయితే ఈవీఎం ( EVMS) మెషీన్లో 2,000 నుంచి 3,840 ఓట్లు నిల్వ ఉన్నాయని పిటిషన్లో చెప్పుకొచ్చింది. అంటే ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఒక్కో నియోజకవర్గానికి 50 ఈవీఎం ( EVMS) మిషన్ల డేటాను తారుమారు చేయడం ద్వారా లక్ష నుంచి 1.92 లక్షల ఓట్ల వరకు మోసం జరిగే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్తో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉండటంతో ఈవీఎంల పనితీరుపై, అలాగే అధికార పార్టీపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నదని కాంగ్రెస్ (Congress) పిటిషన్లో పేర్కొనింది. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ( Supreme Court ) ధర్మాసనం విచారణ చేయనుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!