Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇటీవల కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో మూడు రాష్ట్రాల సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కూడా లోపలికి రానీయకుండా నలుగురే కూర్చుని ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఏపీలో గుండ్రేవుల ప్రాజెక్టులు కడతామంటుంటే మన ముఖ్యమంత్రి చారిత్రక ఒప్పందం అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో గుండ్రేవులకు నీళ్లు ఇవ్వబోమని ట్రిబ్యునల్ చెప్తే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రానీయకుండా అడ్డుకున్నామని, కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి తన శిష్యుడైన తెలంగాణలో సీఎం అయ్యాడనే ధీమాతో మళ్లీ ఆ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని ఆరోపించారు.
ఆర్డీఎస్ (RDS) కు పక్కా నీటి కేటాయింపులపై ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందా అని ప్రశ్నిస్తూ, రేవంత్ రెడ్డికి నీటి వాటాలపై కనీస అవగాహన లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ అస్సలు ఒప్పుకోదని స్పష్టం చేశారు. గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏడాదికి సగటున 4 టీఎంసీల చొప్పున అనుమతులు తెస్తే, బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏడాది 44 టీఎంసీల చొప్పున పర్మిషన్లు తెచ్చామని గుర్తుచేశారు. మనకు రావాల్సిన 968 టీఎంసీలలో 830 టీఎంసీలకు అనుమతులు తెచ్చుకున్నామని, ఇంకా 138 టీఎంసీల అనుమతులు రావాల్సి ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ‘బనకచర్ల’ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని, ఆ నిద్రను తట్టిలేపింది బీఆర్ఎస్సేనని చెప్పారు.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
పాలమూరు పేరిట సమ్మక్క సారక్క ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నారని, తాగేందుకు మంచి నీళ్లు లేక పాలమూరు తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోని మేడిగడ్డ గేట్లను రిపేర్ చెయ్యడం చేతకాదు గానీ, తుంగభద్ర గేట్ల రిపేర్ కోసం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని విమర్శించారు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి హిట్లర్ స్ఫూర్తి అయితే, నీళ్ల విషయంలో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి స్ఫూర్తి అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గుంపు మేస్త్రి అయిన రేవంత్ రెడ్డి, తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావొద్దని హరీష్ రావు హితవు పలికారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ సుజలం, కర్ణాటక సుఫలం, తెలంగాణ నిష్ఫలంగా మారుతోందని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు ఒక్క చుక్క నీటి విషయంలో అన్యాయం జరిగినా కేసీఆర్, బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..