Harish Rao : రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు
- మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని
- ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని మండిపడ్డ హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
“మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, చిరు ఉద్యోగుల పేదరికం కనబడటం లేదని ఆయన విమర్శించారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) ఉద్యోగులు, నెల రోజులుగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు వంటి వేలాది చిరు ఉద్యోగులు తమ జీతాల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారనే దయనీయ పరిస్థితి నెలకొనిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Manchu Family : జిల్లా అదనపు కలెక్టర్ తో ముగిసిన మంచు మనోజ్ వివరణ
“దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నెలలు గడిచినా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై, చిరు ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు. వాళ్లు కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై గట్టి విమర్శలు చేశారు. “కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్పుకోవడం మానేయండి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి,” అని సూచించారు. చిరు ఉద్యోగులందరికీ వెంటనే వేతనాలు చెల్లించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కష్టాలను మరిచి సొంత ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం తగదని హరీష్ రావు తేల్చిచెప్పారు.
Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్” దాడి ప్రారంభం..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!