IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Injury is impact on India team’s composition: స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్ను బలోపేతం చేయడం కోసం శార్దూల్ ఠాకూర్పై వేటు వేసి.. మొహ్మద్ షమీని తీసుకోవాల్సి వచ్చింది. అలానే బ్యాటింగ్ బలోపేతం కోసం సూర్యకుమార్ యాదవ్ను ఆడించారు. షమీ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. సూర్య కీలక సమయంలో రానౌట్ అయి నిరాశపరిచాడు.
ఇక ఆదివారం లక్నోలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. లక్నోలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్గా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ను ఎంచుకోవడంపై భారత్ మేనేజ్మెంట్ దృష్టిసారించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. స్పెషలిస్టు పేసర్లను ఇద్దరికి పరిమితం చేయాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీలలో ఒకరే ఆడుతారు. సిరాజ్, షమీలలో ఎవరిని ఎంచుకోవడం అంటే తలనొప్పే.
Also Read
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
Also Read: Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!
మొహ్మద్ సిరాజ్ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్ పేసర్గా ఉన్నాడు. అయితే మొహ్మద్ షమీ గత మ్యాచ్లో చెలరేగాడు. దాంతో ఎవరి వైపు మొగ్గుచూపాలో కెప్టెన్, కోచ్కు ఇబ్బందే. ఇద్దరు పేసర్లను మాత్రమే తీసుకోవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. హార్దిక్ పాండ్యా ఉంటే మిడిలార్డర్ బ్యాటింగ్లో చేయడమే కాక.. మూడో పేసర్గా ఉండేవాడు. భారత్ 4 మ్యాచ్లలో ఈ కూర్పుతోనే బరిలోకి దిగింది. ఇప్పుడు హార్దిక్ లేకపోవడంతో పెద్ద సమస్యగ మారింది. ఆర్ అశ్విన్ను ఆల్రౌండర్గా భావించి.. ముగ్గురు పేసర్లను ఎంచుకుంటే ఎలా ఉంటుందనే వాదన కూడా ఉంది. అయితే ఆ సందర్భంలో బ్యాటింగ్ బలహీన పడే ప్రమాదం ఉంది. టోర్నీలో ఘోర పరాజయాలు చవిచూస్తున్న ఇంగ్లండ్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దాంతో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!