IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Injury is impact on India team’s composition: స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్ను బలోపేతం చేయడం కోసం శార్దూల్ ఠాకూర్పై వేటు వేసి.. మొహ్మద్ షమీని తీసుకోవాల్సి వచ్చింది. అలానే బ్యాటింగ్ బలోపేతం కోసం సూర్యకుమార్ యాదవ్ను ఆడించారు. షమీ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. సూర్య కీలక సమయంలో రానౌట్ అయి నిరాశపరిచాడు.
ఇక ఆదివారం లక్నోలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. లక్నోలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్గా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ను ఎంచుకోవడంపై భారత్ మేనేజ్మెంట్ దృష్టిసారించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. స్పెషలిస్టు పేసర్లను ఇద్దరికి పరిమితం చేయాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీలలో ఒకరే ఆడుతారు. సిరాజ్, షమీలలో ఎవరిని ఎంచుకోవడం అంటే తలనొప్పే.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!
మొహ్మద్ సిరాజ్ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్ పేసర్గా ఉన్నాడు. అయితే మొహ్మద్ షమీ గత మ్యాచ్లో చెలరేగాడు. దాంతో ఎవరి వైపు మొగ్గుచూపాలో కెప్టెన్, కోచ్కు ఇబ్బందే. ఇద్దరు పేసర్లను మాత్రమే తీసుకోవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. హార్దిక్ పాండ్యా ఉంటే మిడిలార్డర్ బ్యాటింగ్లో చేయడమే కాక.. మూడో పేసర్గా ఉండేవాడు. భారత్ 4 మ్యాచ్లలో ఈ కూర్పుతోనే బరిలోకి దిగింది. ఇప్పుడు హార్దిక్ లేకపోవడంతో పెద్ద సమస్యగ మారింది. ఆర్ అశ్విన్ను ఆల్రౌండర్గా భావించి.. ముగ్గురు పేసర్లను ఎంచుకుంటే ఎలా ఉంటుందనే వాదన కూడా ఉంది. అయితే ఆ సందర్భంలో బ్యాటింగ్ బలహీన పడే ప్రమాదం ఉంది. టోర్నీలో ఘోర పరాజయాలు చవిచూస్తున్న ఇంగ్లండ్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దాంతో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!