Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umpire’s Call Cost Pakistan Defeat To South Africa: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో దాయాది పాకిస్థాన్ కథ ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాక్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లో అయిదో విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా సెమీస్కు మరింత చేరువ కాగా.. వరుసగా నాలుగో ఓటమితో పాక్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే గెలిచే మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ‘అంపైర్స్ కాల్’. ఈ అంపైర్స్ కాల్ పాక్ కొంపముంచింది.
271 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం కాగా.. ప్రొటీస్ గెలుపుకు 11 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో ప్రపంచకప్ 2023లోనే ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా మారింది. పాక్ పేసర్లు బంతులతో నిప్పులు చెరుగుతుండటంతో బావుమా సేన ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అంపైర్స్ కాల్ రూపమ్లో పాకిస్థాన్ను దురదృష్టం వెంటాడింది.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్థాన్ సీనియర్ పేసర్ హరీష్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ పాడ్స్ తాకింది. దాంతో పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కెప్టెన్ బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్గా ప్రకటించాడు. బాల్ ట్రాకింగ్లో బంతి లెగ్ స్టంప్ను లైట్గా తాకడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. దాంతో షంసీ బతికిపోయాడు. ఆపై ప్రొటీస్ విజయాన్ని అందుకుంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
బాల్ ట్రాకింగ్లో 50 శాతం కంటే తక్కువ లెగ్ లేదా ఆఫ్ స్టంప్ను బంతిని తాకితే అంపైర్స్ కాల్గా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే.. తబ్రైజ్ షంసీ అవుట్ అయ్యేవాడు. దాంతో ప్రొటీస్ జట్టు 263 పరుగులకే ఆలౌటయ్యేది. అప్పుడు పాక్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సెమీస్ రేసులో నిలిచేది. ఇక్కడ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. పాక్ ఓటమి ఖాయం అయింది. ప్రస్తుతం అంపైర్ కాల్స్ నిబంధనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!