Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!
Umpire’s Call Cost Pakistan Defeat To South Africa: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో దాయాది పాకిస్థాన్ కథ ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాక్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లో అయిదో విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా సెమీస్కు మరింత చేరువ కాగా.. వరుసగా నాలుగో ఓటమితో పాక్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే గెలిచే మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ‘అంపైర్స్ కాల్’. ఈ అంపైర్స్ కాల్ పాక్ కొంపముంచింది.
271 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం కాగా.. ప్రొటీస్ గెలుపుకు 11 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో ప్రపంచకప్ 2023లోనే ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా మారింది. పాక్ పేసర్లు బంతులతో నిప్పులు చెరుగుతుండటంతో బావుమా సేన ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అంపైర్స్ కాల్ రూపమ్లో పాకిస్థాన్ను దురదృష్టం వెంటాడింది.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
పాకిస్థాన్ సీనియర్ పేసర్ హరీష్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ పాడ్స్ తాకింది. దాంతో పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కెప్టెన్ బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్గా ప్రకటించాడు. బాల్ ట్రాకింగ్లో బంతి లెగ్ స్టంప్ను లైట్గా తాకడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. దాంతో షంసీ బతికిపోయాడు. ఆపై ప్రొటీస్ విజయాన్ని అందుకుంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
బాల్ ట్రాకింగ్లో 50 శాతం కంటే తక్కువ లెగ్ లేదా ఆఫ్ స్టంప్ను బంతిని తాకితే అంపైర్స్ కాల్గా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే.. తబ్రైజ్ షంసీ అవుట్ అయ్యేవాడు. దాంతో ప్రొటీస్ జట్టు 263 పరుగులకే ఆలౌటయ్యేది. అప్పుడు పాక్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సెమీస్ రేసులో నిలిచేది. ఇక్కడ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. పాక్ ఓటమి ఖాయం అయింది. ప్రస్తుతం అంపైర్ కాల్స్ నిబంధనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!